Eatela Rajendar: తెలంగాణ రాష్ట్ర సమితీ సీనియర్ నేతల్లో ఒకరైన మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎపిసోడ్ అనేక మలుపులు తిరుగుతున్న సంగతి తెలిసిందే. భూకబ్జాల ఆరోపణల నేపథ్యంలో మంత్రి పదవి కోల్పోయిన అనంతరం ఆయన ఏ పార్టీలో చేరనున్నారనే ఆసక్తి నెలకొంది. అయితే, ఆయన బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారని టాక్ వస్తోంది. ఈ సమయంలో మరో రూపంలో ఆయన్ను టార్గెట్ చేస్తోంది. బీజేపీలో ఈటల రాజేందర్ చేరడం దాదాపు ఖాయం కావడంతో ఆ పార్టీలో ముసలం మొదలైన సంగతి తెలిసిందే ఈ పరిస్థితిని తనకు అనుకూలంగా టీఆర్ఎస్ మలుచుకుంటోంది.
Read More : Eatela Rajendar: ఈటల రాజేందర్… కొంత క్లారిటీ …. ఎంతో కన్ఫ్యూజన్….
ఈటల రాకపై కలకలం…
ఈటల రాజేందర్ బీజేపీలో చేరడాన్ని హుజురాబాద్ కు చెందిన పలువురు నాయకులు వ్యతిరేకిస్తున్నారు. ఈటల విషయంలో బీజేపీ నేతల తీరును నిరసిస్తూ కరీంనగర్లోని హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన బీజేపీ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు టీఆర్ఎస్లో చేరుతున్నారు. హుజూరాబాద్ 11వ వార్డు కౌన్సిలర్ దండ శోభ, నాయకులు విక్రమ్రెడ్డి కరీంనగర్లో మంత్రి గంగుల కమలాకర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. 18వ వార్డు కౌన్సిలర్ ప్రతాప మంజుల, ఆమె భర్త కృష్ణ, మాజీ కౌన్సిలర్ పోరెడ్డి రజిత, ఆమె భర్త సీనియర్ నాయకుడు శంతన్రెడ్డిలు కూడా టీఆర్ఎస్లో చేరారు.
Read More : KCR: కేసీఆర్ , జగన్ … ఏపీ తెలంగాణ ప్రజల బాధలు పట్టించుకోండి!
ఈటల ఇమేజ్ డ్యామేజ్
టీఆర్ఎస్ కండువా కప్పుకొన్న నేతలు ఈటలపై విరుచుకుపడటం గమనార్హం. తన అక్రమ ఆస్తులను కాపాడుకునేందుకే ఈటల బీజేపీలో చేరుతున్నారని మండిపడ్డారు. ఈటల సౌమ్యుడు కాదని, ఆయన రాజకీయాలు చాలా దారుణంగా ఉంటాయని పార్టీలో చేరిన నేతలు ఆరోపించారు. ఈటలతో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నామని అందుకే ఒకే పార్టీలో ఆయనతో కలిసి పనిచేయలేక తాము టీఆర్ఎస్లోకి వచ్చినట్టు చెప్పారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?