Eatela Rajendar: సీనియర్ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ గత కొద్దికాలంగా జరుగుతున్న చర్చకు చెక్ పెడుతూ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో వచ్చిన విబేధాల కారణంగా ఆయన పార్టీకి ఇటు ఎమ్మెల్యే పదవికి గుడ్ బై చెప్పేశారు. అయితే, ఈ రాజీనామా చేయడంతో ఈటల రాజేందర్ ఓ ప్రత్యేకత సాధించారు. ఎమ్మెల్యే పదవికి మూడో దఫా ఆయన రాజీనామా చేశారు. తెలంగాణ ఏర్పాటు చేసిన తరువాత ఏడేళ్లలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తొలి టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఈటల రాజేందర్ నిలిచారు.
ReadMore: Eatela Rajendar: ఈటల చేయలేనిది… చేసి చూపించిన కేసీఆర్ …
ఈటల ప్రస్థానం ఇది…
టీఆర్ఎస్ పార్టీ స్థాపించిన తరువాత ఏడాదికి ఆ పార్టీలో చేరిన ఈటల రాజేందర్ 2004లో టీఆర్ఎస్ అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత ఉద్యమ వ్యూహాల్లో భాగంగా 2008, 2010లో పదవికి రాజీనామా చేశారు. ఉప ఎన్నికల్లో పోటీచేసి మరోసారి ఎమ్మెల్యేగా ఈటల రాజేందర్ విజయం సాధించారు. ఆ తర్వాత 2009లో శాసనసభ నియోజకవర్గాల పునర్విభజనతో కమలాపూర్ నియోజకవర్గం రద్దై హుజూరాబాద్ కేంద్రంగా కొత్త నియోజకవర్గం ఏర్పడింది. అనంతరం ఈటల రాజేందర్ హుజూరాబాద్ శాసనసభ్యుడిగా వరుసగా నాలుగు సార్లు గెలుపొందారు. ఈ గెలుపుతో వరుసగా ఆరుసార్లు అసెంబ్లీకి ఎన్నికై రికార్డు సాధించిన ఈటల రాజేందర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత 2014లో కేసీఆర్ మంత్రివర్గంలో ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రిగా అవకాశం పొందారు. 2019లో కేసీఆర్ రెండో మంత్రివర్గంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు ఈటల రాజేందర్ నిర్వహించారు. తాజాగా ఇటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం అటు మంత్రి పదవి కోల్పోయారు.
Read More: Eatela Rajendar: ఈటల రెండో సీఎం… టీఆర్ఎస్ నేత సంచలన వ్యాఖ్యలు..
ఈటల ప్రత్యేకతలు ఇవి…
పదవీ కాలం ఉండగానే ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా చేయడం ఇది మూడోసారి కావడం విశేషం. తాజాగా, మళ్లీ ఆయన హుజురాబాద్ లో మళ్లీ ఆయనే బీజేపీ తరఫున బరిలో దిగనున్నారు. ఈ ఎన్నికను ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముందుకు సాగుతున్నారు. మరోవైపు టీఆర్ఎస్ పార్టీ సైతం అదే రీతిలో వ్యూహాత్మకంగా కదులుతున్న పరిస్థితి. దీంతో ఈ ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?