Eatela Rajendar: మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఇలాకా అయిన హుజూరాబాద్ నియోజకవర్గం ఉప ఎన్నిక మీడియాలో పతాక శీర్షికగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. బీజేపీ తరఫున ఈటల బరిలో ఉండగా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేరును ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి నాయకుడికి ఉన్న వ్యక్తికి అవకాశం ఇచ్చినట్లు టీఆర్ఎస్ పార్టీ ప్రకటిస్తోంది. అయితే, ఈ ఉప ఎన్నికపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.
Read More: KCR: హుజురాబాద్ లో అభ్యర్థితో కేసీఆర్ ఏం చెప్పదల్చుకున్నారంటే…
నాగార్జునసాగర్.. హుజురాబాద్ రెండూ ఒకటేనా?
హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థిగా పార్టీ అధిష్టానం గెల్లు శ్రీనివాస్ యాదవ్ను ప్రకటించడంపై టీఆర్ఎస్ వర్గాలు కొత్త చర్చను తెరమీదకు తెచ్చాయి. నాగార్జున సాగర్లో సీనియర్ రాజకీయవేత్త జానారెడ్డిని ఓడించి యువనేత నోముల భగత్ గెలుపొందినట్లే…అవే ఫలితాలు హుజురాబాద్ లో రిపీట్ అవుతాయని అంటున్నారు. గెల్లు శ్రీనివాస్ యాదవ్ తెలంగాణ ఉద్యమంలో గట్టిగా పోరాడిన నాయకుడని, తెలంగాణ ఏర్పాటు కోసం జైలుకు వెళ్లిన వ్యక్తి అని పేర్కొంటూ ఇదే పాయింట్ల ఆధారంగా ఈటల రాజేందర్ ను టార్గెట్ చేయనున్నట్లు చెప్తున్నారు.
Read More: KCR: హుజురాబాద్కు షాకిచ్చి వాసాలమర్రిలో కేసీఆర్ ఆ మాట ఎందుకు చెప్పారంటే…
అప్పుడే రాజకీయాలు..
తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సీఎం కేసీఆర్ రాజకీయాల్లో నవతరాన్ని ప్రోత్సహిస్తున్నారన్నారు. బడుగు, బలహీన వర్గాలకు అవకాశాలు కల్పిస్తున్నారని చెప్పారు. బీసీ వర్గాలకు అనేక రాజకీయ పదవులు ఇస్తున్నారని తెలిపారు. రాబోయే హుజూరాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ను ప్రజలు ఆశ్వీరదించాలని కోరారు. శ్రీనివాస్ నిరంతరం ప్రజల మధ్య ఉంటున్న నాయకుడని అన్నారు. హుజురాబాద్ ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండే గెల్లు శ్రీనివాస్ ను గెలిపిస్తే పెండింగ్ అభివృద్ధి అంతా పూర్తి అవుతుందని చెప్పారు. సర్వేలన్ని టీఆర్ఎస్ కే అనుకూలంగా ఉన్నాయని తలసాని చెప్పుకొచ్చారు.