Eatela Rajendar: మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ తన ఇలాకా అయిన హుజురాబాద్లో పాదయాత్ర చేస్తన్న సమయంలో అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. అపోలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ఈటల ఈ ఆస్పత్రి వద్దే మీడియాతో మాట్లాడుతూ…సీఎం కేసీఆర్పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే టీఆర్ఎస్ పార్టీలో చేరిన కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంపై విరుచుకుపడ్డారు. కేసీఆర్ ఉద్యమ ద్రోహులకు పట్టం కడుతున్నారని ఆరోపించారు.
Read More: Eatela Rajendar: కేసీఆర్ స్కీం పెట్టినందుకు ఈటల కు పాలాభిషేకం చేశారు!
జగన్కు మద్దతు ఇచ్చిన వ్యక్తి..
జగన్ ఓదార్పు యాత్ర కు మద్దతిచ్చిన వ్యక్తి, తెలంగాణ ఉద్యమకారులపై రాళ్ల దాడి చేసిన వ్యక్తికి ఎమ్మెల్సీ ఇచ్చారని సీఎం కేసీఆర్పై కౌశిక్ రెడ్డి విమర్శలు గుప్పించారు. కేసీఆర్ ఎప్పుడు ఎవరికి పట్టం కడతారో జనం అర్థం చేసుకోవాలని ఆయన కోరారు. దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తానని హామీ ఇచ్చి నెరవేర్చలేదని ఈటల పేర్కొన్నారు. తాజాగా దళితు బంధు అంటూ కొత్త నాటకానికి తెరలేపారని ఈటల విమర్శల వర్షం కురిపించారు. కేసీఆర్ ప్రజలను కాకుండా పైసల్ని నమ్ముతాడని ఈటల ఆరోపించారు. హుజురాబాద్లో రూ. 150 కోట్ల నగదు పంపిణీ చేశారని సంచలన కామెంట్లు చేశారు.
Read More: KCR: హుజురాబాద్ ఉప ఎన్నిక.. కేసీఆర్ కు ఓ గుడ్ న్యూస్… ఇంకో బ్యాడ్ న్యూస్…
వాళ్లను నమ్ముకుంటున్న ఈటల
ముఖ్యమంత్రి కేసీఆర్ ఎత్తుగడలను హుజురాబాద్ ప్రజలు గమనిస్తున్నారని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. కేవలం ఎన్నికలున్నాయనే కోణంలోనే ఇప్పుడు కొత్త పథకాలు , నాయకులకు పదవులు కట్టబెడుతున్న విషయాన్ని తెలుసుకోలేనంత అమాయకులు తమ ప్రజలు కాదని ఆయన వ్యాఖ్యానించారు. హుజురాబాద్ ప్రజలు ప్రలోభాలకు లొంగిపోరని తాను నమ్ముతున్నట్లు ఈటల పేర్కొన్నారు.