తెలంగాణ రాష్ట్రంలో వరుసగా ఈడీ, ఐడీ దాడులు వ్యాపారాలతో ముడిపడి ఉన్న టీఆర్ఎస్ నేతల్లో గుబులు రేపుతున్నాయి. తెలంగాణలోని పలు గ్రానైట్ సంస్థలు అక్రమాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలతో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), ఆదాయపన్ను (ఐటీ) శాఖ అధికారులు నిన్న రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సోదాలు జరిపారు. మంత్రి గంగుల కమలాకర్ నివాసం, కార్యాలయంలో సోదాలు నిర్వహించగా, తాజాగా ఈ రోజు శ్రీనగర్ కాలనీలోని టీఆర్ఎస్ ఎంపీ గాయత్రి రవి కార్యాలయంలో సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ తో పాటు కరీంనగర్ కార్యాలయాల్లోనూ సోదాలు కొనసాగుతున్నాయి.
ఒక వైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్ దర్యాప్తులో భాగంగా ఈడీ అధికారుల సోదాలు, విచారణలు కొనసాగుతున్న క్రమంలోనే గ్రానైట్ సంస్థల్లో అక్రమాల అభియోగాలపై ఈడీ,. ఐటీ అధికారులు దృష్టి సారించడం అధికార టీఆర్ఎస్ వర్గాల్లో గుబులు రేపుతున్నాయి. ఈడీ సోదాల నేపథ్యంలో హుటాహుటిన దుబాయ్ నుండి తిరిగి వచ్చిన మంత్రి గంగుల కమలాకర్ ఈడీ దర్యాప్తునకు సహకరిస్తానని తెలిపారు. తమ వ్యాపారం మొత్తం పారదర్శకంగానే జరుగుతోందని చెప్పారు.
కరీంనగర్ లోని తొమ్మిది గ్రానైట్ సంస్థలు అక్రమాలకు పాల్పడుతున్నాయని పేరాల శేఖర్ అనే వ్యక్తి గత ఏడాది సీబీఐ, ఎన్జీటీ, కేంద్ర పర్యావరణ శాఖకు ఫిర్యాదు చేశారు. ఇదే అంశంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కూడా కేంద్రానికి పిర్యాదు చేశారు. ఈ రెండు పిర్యాదుల ఆధారంగా ఈడీ, ఐటీ అధికారుల బృందాలు తనిఖీలు చేస్తున్నట్లు సమాాచారం. హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మంలోని గ్రానైట్ సంస్థల యజమానుల నివాసాలు, అపీసులపై తనిఖీలు చేసిన అధికారులు పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తొంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?