బీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి ఈడీ బిగ్ షాక్ ఇచ్చింది. ఈ రోజు ఉదయం 11 గంటలకు విచారణకు హజరు అవుతానంటూ సమాధానం ఇచ్చిన రోహిత్ రెడ్డి చివరి నిమిషంలో తనకు సమయం కావాాలంటూ ఈడీకి ట్విస్ట్ ఇస్తూ లేఖ రాశారు. అయితే రోహిత్ రెడ్డి అభ్యర్థనను తిరస్కరించడంతో సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు ఈడీ అధికారుల ముందు విచారణకు హజరైయ్యారు రోహిత్ రెడ్డి. దాదాపు ఆరు గంటల పాటు రోహిత్ రెడ్డిని ఈడీ అధికారుుల విచారించారు. సోమవారం విచారణ ముగిసిన తర్వాత రేపు మళ్లీ రావాలంటూ ఈడీ అధికారులు ఆయనకు సూచించారు.
సోమవారం ఈడీ అధికారుల విచారణ ముగిసిన తర్వాత రోహిత్ రెడ్డి మీడియా ముందు మాట్లాడుతూ ఈ రోజు విచారణలో సాంతం తన బయోడేటా గురించి మాత్రమే ప్రశ్నించారని తెలిపారు. తమ వ్యక్తిగత వివరాలతో పాటు వ్యాపార లావాదేవీల గురించి అడిగారని చెప్పారు. అయితే తనను ఏ కేసు గురించి ప్రశ్నిస్తున్నారు అనే విషయం అర్ధం కాలేదనీ, ఎలాంటి ఇల్లీగల్ లావాదేవీల గురించి అడగలేదని తెలిపారు. తనపై వస్తున్న ఆరోపణలకు సంబంధించి ఎలాంటి ప్రశ్నలను సంధించలేదన్నారు. అయితే తనను ఏ కేసులో విచారణ చేస్తున్నారు అనే విషయంపై తానే ప్రశ్నించినా వారు స్పష్టత ఇవ్వలేదని చెప్పారు. రేపు ఉదయం 10.30 గంటలకు మళ్లీ విచారణకు హజరు కావాలని తెలిపారన్నారు. తన వద్ద నుండి గుర్తింపు కార్డులు, ఆధార్ కార్డు, పాస్ పోర్టు నకలు కాపీలను తీసుకున్నారన్నారు.
తాను అయ్యప్ప దీక్షలో ఉన్నాననీ, ఈ నెల 31వ తేదీ వరకూ దీక్ష సమయం పూర్తి అయిపోతుందని, విచారణకు సమయం కావాలని తొలుత ఈడీని కోరినప్పటికీ వారు తన అభ్యర్ధనను తిరస్కరించారని చెప్పారు. చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా తాను ఈ రోజు విచారణకు హజరైనట్లు తెలిపారు రోహిత్ రెడ్డి. అయితే రేపు విచారణకు సంబంధించి తన న్యాయవాదులతో చర్చించి తర్వాత నిర్ణయం తీసుకుంటానని చెప్పారు రోహిత్ రెడ్డి. ఎఫ్ఐఆర్ కానీ ఇవ్వకుండా, ఏ కేసులో విచారణ జరుపుతున్నారో తెలియజేయకుండా విచారణకు నోటీసులు జారీ చేయడంపై రోహిత్ రెడ్డి మధ్యంతర ఉత్తర్వుల కోసం హైకోర్టును ఆశ్రయించే అవకాశం ఉందని అంటున్నారు.
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల కేసులో రోహిత్ రెడ్డి ఫిర్యాదుదారుడిగా ఉన్న సంగతి తెలిసిందే. రోహిత్ రెడ్డి ఫిర్యాదు మేరకే మొయినాబాద్ ఫామ్ హౌస్ లో రామచంద్రభారతి, నందకుమార్, సింహయాజీ లను పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ వ్యవహారం తెలంగాణలోనే కాక దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం అయ్యింది. ఆ కేసులో బీజేపీ కీలక నేతలకు సిట్ నోటీసులు జారీ చేయడంతో వారు హైకోర్టును ఆశ్రయించి స్టే ఉత్తర్వులు పొందారు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కేసిఆర్ సర్కార్ మధ్య జరుగుతున్న వార్ నేపథ్యంలో ఆయా పార్టీల నేతలు విచారణలను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి అని అంటున్నారు.