Rape : ఓ యువతి మీద అత్యాచారం, మహిళ మీద Rape అఘాయిత్యం అంటూ వార్తలు రాగానే… వీరావేశంతో రెచ్చిపోయి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే నేటి యువతరం ఒక్కసారి ఘట్కేసర్ యువతీ తప్పుడు రేప్ బాగోతం విన్న తర్వాత తన తీరు మార్చుకుంటే బాగుటుంది. ఆడపిల్లకు అండగా నిలవడం తప్పు కాదు.. మహిళలు వారి రక్షణకు నిలవడం అసలు తప్పు కాదు. కానీ అన్ని తెలుసుకోకుండా ఇష్టానుసారం మాట్లాడడమే అసలైన తప్పు. కనీస ఆధారాలు ప్రాథమిక సాక్ష్యాలూ లేకుండా ఓ రేప్ కేసు మీద ఇష్టానుసారం మనం మాట్లాడితే తర్వాత రాబోయే పరిణామాలు విని చూసి విస్తుపోవడం మన వంతు అవుతుంది.
ఘట్కేసర్ Rape ఘటనలో ఏం జరిగింది?
ఘట్కేసర్ పరిధిలోని నాగారం చౌరస్తా లో ఫార్మసీ విద్యార్థిని అత్యాచార ఘటనలో నాటకీయ పరిణామాలు వెలుగులోకి వచ్చాయి. కేసులో బాధితురాలు అయిన యువతిని పోలీసులు ప్రశ్నించడంతో ఆమె చెప్పిన సమాధానాలు పోలీసులు సైతం నివ్వెరపరిచాయి. అప్పటివరకు ఆటో డ్రైవర్లు తనను అత్యాచారం చేసి బలవంతంగా మత్తు పదార్థాలను ఇచ్చారని చెప్పిన ఆ యువతి అకస్మాత్తుగా మాట మార్చింది. అప్పటికే అన్ని టీవీ లో బ్రేకింగ్ న్యూస్ లు వేయడంతో పాటు గతంలో జరిగిన దిశా ఘటన అంత కంటే దారుణమైన ఘటన అండ్ ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్లు ఇష్టానుసారం చెప్పడంతో చాలా మంది యువత ఊగిపోయారు. సోషల్ మీడియాలో రకరకాల పోస్టులు పెట్టి ఆటో డ్రైవర్లు అంతా ఇలాగే ఉంటారు అనేలా పోస్టులు పెట్టారు. అయితే ఈ కేసులో లోతుగా దర్యాప్తు చేయాలని నిర్ణయించుకున్నా పోలీసులు యువతిని హాస్పిటల్ చెకప్ తర్వాత గట్టిగా ప్రశ్నించడంతో అసలు విషయాలు బయటకు వచ్చాయి.
ప్రియుడితో వెళ్లి.. తల్లికి భయపడి
యువతి ఆటో ఎక్కి రాంపల్లి వరకు వెళ్లి అక్కడ ద్విచక్రవాహనంపై వేచిచూస్తున్న ప్రియుడితో కలిసి బయటకు వెళ్లింది. ఆ తర్వాత ప్రియుడి ఇద్దరు సోదరులతో కలిసి ఆమె కూడా గంజాయి తాగింది. గంజాయి మత్తులో ఆమె అనుమతితోనే అక్కడ ఉన్న వారంతా ఆమెపై లైంగిక వాంఛలు తీర్చుకునే పోలీసుల దర్యాప్తులో తేలింది. దాని తర్వాత ఆమె ఫోన్ కు తల్లి తరుచు ఫోన్ చేస్తుండటంతో ఆమెకు ఏం చెప్పాలో అర్థంకాక కొందరు ఆటో డ్రైవర్లు తను అపహరించుకొని గుర్తు తెలియని ప్రదేశానికి తీసుకు వెళ్లారని, అక్కడ అత్యాచారానికి పాల్పడ్డారని తల్లికి చెప్పింది. పోలీసులు గాలింపు ముమ్మరం చేయడంతో భయపడిన యువకులు యువతిని రోడ్డుపై వదిలేసి వెళ్లిపోయారు. మత్తులో ఉన్న ఆమెను పోలీసులు ఆసుపత్రిలో చేర్పించారు.
బయట పడింది ఇలా
కేసును లోతుగా దర్యాప్తు చేయాలని భావించిన పోలీసులు యువతి ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన తర్వాత ఆమె ప్రత్యేకంగా ప్రశ్నించారు. దీంతోపాటు ఆమె ఎక్కడైతే ఆటో ఎక్కింది అని చెబుతున్నారో అక్కడ ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించగా ఆమె ఓ ద్విచక్ర వాహనంలో వెళుతున్నట్లు గుర్తించారు. దీంతో యువతి ని గట్టిగా ప్రశ్నించగా తన ప్రియుడితో వెళ్ళినట్లు తల్లికి భయపడే అబద్ధం చెప్పినట్లు పోలీసులకు చెప్పింది.
రేప్ అనగానే ఉగిపోకండి!
ప్రస్తుతం సమాజంలో నేటితరం అన్ని విషయాల మీద అవగాహనతో ఉంటున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో వస్తున్న అని వార్తలు ఫాలో అవుతున్నారు. మహిళలు యువతులు బయటకు వచ్చే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ అక్కడక్కడా అత్యాచార ఘటనలు నిజంగానే జరుగుతున్నాయి. అయితే మీడియాలో వచ్చినట్లు ప్రతి అత్యాచార ఘటన రేప్ కాదు. దాని వెనుక ఉన్న నిజాలు తెలుసుకొని మాత్రమే యువత స్పందిస్తే మేలు. అప్పుడే నిర్భయ లాంటి పెద్ద పెద్ద ఘటనలు దేశానికి తెలుస్తాయి. బయటకు వస్తాయి. ప్రతి చిన్న వార్త తెలియగానే ఆవేశంతో రెచ్చిపోయి పోస్టులు పెట్టే అంటే దాని వెనుక ఉన్న నిజానిజాలను పూర్తిస్థాయిలో గ్రహించి యువత ముందుకు వెళితేనే చైతన్య భారతం సాధ్యం.