Konda Visveswara Reddy: దాదాపు ఏడాది కాలంగా ఏ పార్టీలో చేరకుండా ఉండా చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి నేడు కాషాయ తీర్ధం పుచ్చుకున్నారు. ఈ రోజు ఉదయమే తాను బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించిన విశ్వేశ్వరరావు సాయంత్రం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన బీజేపీ విజయసంకల్ప సభలో పార్టీలో చేరారు. ముందుగా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి తరుణ్ చుగ్ కొండా విశ్వేశ్వరరెడ్డి చేయిపట్టుకుని కార్యకర్తలకు అభివాదం చేయించారు. ఆ తరువాత పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డా చేతుల మీదుగా ఆయనకు కాషాయ కండువా కప్పుకున్నారు.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
కొండ విశ్వేశ్వరరెడ్డి మాజీ డిప్యూటి సీఎం కేవి రంగారెడ్డి మనువడు. 2013 లో కేసిఆర్ ఆహ్వానం మేరకు టీఆర్ఎస్ లో చేరిన విశ్వేశ్వరరెడ్డి 2014 లో చేవెళ్ల ఎంపిగా గెలిచారు. 2018 లో టీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. గత ఏడాది మార్చి నెలలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు అయిన తరువాత మళ్లీ విశ్వేశ్వరరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరతారని వార్తలు వచ్చాయి. మరో పక్క ఈటల రాజేందర్ గెలుపునకు విశ్వేశ్వరరెడ్డి కృషి చేసిన నేపథ్యంలో బీజేపీ లో చేరనున్నారంటూ వార్తలు వినబడ్డాయి. అయితే ఈ రోజు బిజేపి అగ్రనేతల సమక్షంలో ఆ పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు.