Breaking: సంగారెడ్డి జిల్లాలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ఉద్యోగులు మృతి చెందారు. జిన్నారం మండలం గడ్డపోతారం ఇండస్ట్రియల్ ఎస్టేట్ లోని మైలాన్ రసాయన పరిశ్రమలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఫ్యాక్టరీలో టెట్రా మేతేలే డిసిలోక్సానే అనే రసాయనాన్ని ఒక చోట నుండి మరొక చోటుకు తరలించే క్రమంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.
ఈ ప్రమాదంలో ఫ్యాక్టరీలో అసిస్టెంట్ మేనేజర్ గా పని చేస్తున్న శ్రీకాకుళం కు చెందిన లోకేశ్వరరావు (38), బెంగాల్ కు చెందిన కార్మికుడు పరితోష్ మెహతా, బీహార్ కు చెందిన కార్మికులు రంజిత్ కుమార్ తీవ్రంగా గాయపడ్డారు. వీరిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందారు. అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Official: చంద్రబాబు ఇంటికి వెళ్లిన పవన్ కళ్యాణ్.. ఏ అంశాలపై చర్చించారంటే.!?
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?