Firing: ఆమెరికాలో మరో సారి కాల్పుల కలకలం రేగింది. కాల్పుల్లో తెలంగాణ వాసి ఒకరు మృతి చెందారు. మేరీలాండ్ రాష్ట్రంలో నల్లజాతీయుడు జరిపిన కాల్పుల్లో తెలంగాణ రాష్ట్రం నల్లగొండకు చెందిన నక్క సాయి చరణ్ (26) మృతి చెందారు. సాయి చరణ్ తన స్నేహితుడిని ఎయిర్ పోర్టులో డ్రాప్ చేసి కారులో వెళుతుండగా నల్లజాతీయుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సాయిచరణ్ మృతి చెందాడు.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
సాయిచరణ్ గత రెండేళ్లుగా అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్నాడు. సాయి చరణ్ మృతివార్త తెలిసిన తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా రోధిస్తున్నారు. ఈ ఘటనతో నల్లగొండలో విషాదఛ్చాయలు అలుముకున్నాయి. సాయిచరణ్ భౌతికకాయాన్ని నల్లగొండ తరలించడానికి దేశ అధికారులు చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. అమెరికాలో నల్లజాతీయులు తరచుగా కాల్పులకు తెగబడుతున్నారు. దీంతో అనేక మంది అమాయకుల ప్రాణాలు కోల్పోతున్నారు.