ఓ పక్క క్యాసినో వ్యవహారంతో ఈడీ విచారణను ఎదుర్కొంటున్న చికోటి ప్రవీణ్ కు మరో కేసు తోడైంది. కడ్తాల్ సమీపంలోని సాయిరెడ్డి గూడెంలో చికోటి ప్రవీణ్ ఫామ్ హౌస్ లో పాములు, అఫ్రికన్ దేశానికి చెందిన జంతువులతో పాటు పైథాన్ ఉందని సమాచారంతో అటవీ శాఖ అధికారులు సోదాలు జరుపుతున్నారు. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రమేష్, డిప్యూటి రేంజ్ ఆఫీసర్ హేమ నేతృత్వంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. చికోటి ఫాం హౌస్ లోని పక్షులు, జంతులను పరిశీలించారు. ఫామ్ హౌస్ అంతా తనిఖీ చేశామని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ హేమ తెలిపారు. జూలో స్వేచ్చగా తిరగాల్సిన వాటిని ఇక్కడ బంధించారని ఆమె తెలిపారు. ఫాం హౌస్ నిర్వహకులపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేస్తామని అధికారులు తెలిపారు.
ఇప్పటికే ఈడీ అధికారులు చికోటి ప్రవీణ్ క్యాసినో వ్యవహారంపై సోదాలు జరిపి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. విచారణకు హజరుకాావాలంటూ నోటీసులు కూడా జారీ చేశారు. ఈ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం అయ్యింది.