మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళిని Bసుబేదారి పోలీసులు అరెస్టు చేశారు. అంబేద్కర్ నగర్ కాలనీలో ఓ ఇంట్లో ఆకునూరి మురళి నిద్రపోతుండగా తెల్లావారుజామున పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంటి తలుపులు పగులగొట్టి మాజీ ఐఏఎస్ ను అరెస్టు చేశారు పోలీసులు. బాలసముద్రంలోని డబుల్ బెడ్రూం ఇళ్ల దగ్గరకు వెళ్తారన్న సమాచారంతో పోలీసులు ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తొంది. బాలసముద్రంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పేదలకు పంచాలంటూ నిరసనకు సిద్దమయ్యారు ఆకునూరి మురళి.
Read More: వివాహం జరిగి ఏడాదితిరక్కముందే ..సాఫ్ట్ వేర్ ఉద్యోగిని బలవన్మరణం.. ఎందుకంటే..?
నిన్న భూపాలపల్లి జిల్లా కేంద్రంలో తాను అయిదు సంవత్సరాల క్రితం కలెక్టర్ గా పని చేసిన సమయంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను లబ్దిదారులకు కేటాయించాలంటూ ఆయన లబ్దిదారులతో కలిసి ఆందోళన చేపట్టారు. 960 ఇళ్లను వెంటనే లబ్దిదారులకు ఇవ్వాలంటూ ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు మురళిని బలవంతంగా అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. స్టేషన్ లోనూ ఆకునూరి మురళి ఆందోళన కొనసాగించారు. మురళికి మద్దతుగా లబ్దిదారులు, మహిళలు స్టేషన్ వద్దకు తరలివచ్చి ఆందోళన చేయడంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆ తర్వాత పోలీసులు మురళిని వ్యక్తిగత పూచికత్తుపై విడుదల చేశారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని గత కొంత కాలంగా ఆకునూరి మురళి తన నిరసన గళం వినిపిస్తున్నారు. నిత్యం ఏదో ఒక ప్రజా సమస్యతో ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని ప్రశ్నిస్తున్నారు. నిన్న భూపాలపల్లిలో ఆందోళన చేసిన విధంగా ఇవేళ బాలసముద్రంలో లబ్దిదారులతో కలిసి ఆందోళన చేపట్టే అవకాశం ఉందని సమాచారం రావడంతో సుబేదారి పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తొంది.
Read More: Breaking: అమర్ రాజా ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం