సినీ హస్యనటుడు, మాజీ మంత్రి, బీజేపీ నేత బాబూమోహన్ నోటి దుల ప్రదర్శించి మరో సారి వివాదంలో చిక్కుకున్నారు. గతంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనూ అధికారులపైనా బూతుల పురాణం అందుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు తాజాగా ఓ కార్యకర్తపై బూతులతో రెచ్చిపోయారు. ఆందోల్ నియోజకవర్గం జోగిపేట బీజేపీ కార్యకర్తపై బాబూ మోహన్ బూతు పురాణంతో విరుచుకుపడ్డారు. బూబూమోహన్ కు వెంకట రమణ అనే బీజేపీ కార్యకర్త ఫోన్ చేసి మీతో కలిసి పని చేస్తానని చెప్పాడు.
దీనితో ‘నువ్వెంత, నీ బతుకెంత’ అంటూ ఆయనపై బాబూమోహన్ శివాలెత్తారు. ‘మళ్లీ ఫోన్ చేస్తే చెప్పుతో కొడతా.. నేను ప్రపంచ స్థాయి నటుడిని.. నువ్వెంత, నేను రాష్ట్ర స్థాయి నాయకుడిని.. మన ఇద్దరి ఓటు బ్యంక్ ఎంతో చూసుకుందాం’ అంటూ సదరు కార్యకర్తలపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. బండి సంజయ్ ఎవడ్రా .. నా తమ్ముడు, కావాలంటే తాను బీజేపీకి రాజీనామా కూడా చేస్తా అంటూ బాబూమోహన్ మాట్లాడిన ఆడియో ఇప్పుటు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. దీంతో బాబూమోహన్ తీరుపై నియోజకవర్గ బీజేపీ నేతలు, కార్యకర్తలు మండిపడుతున్నారు. అయితే ఈ ఆడియో పై బాబూమోహన్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.
స్టార్ కామిడియన్ అయిన బాబూమోహన్ .. ఎన్టీఆర్ పై అభిమానంతో తెలుగుదేశం పార్టీలో చేరారు. 1999 లో మెదక్ జిల్లా ఆందోల్ అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేసి విజయం సాధించారు. సాంఘీక సంక్షేమ శాఖ మంత్రిగా పని చేశారు. ఆ తర్వాత బాబూమోహన్ 2004,2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసిన దామోదర రాజనర్సింహ చేతిలో పరాజయం పాలైయ్యారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో టీడీపీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2014 ఎన్నికల్లో దామోదర రాజనర్సింహపై విజయం సాధించారు. 2018లో బీజేపీలో చేరి ఆ పార్టీ తరపున పోటీ చేసి పరాజయం పాలైయ్యారు.
Breaking: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు సీబీఐకే .. తెలంగాణ హైకోర్టు పచ్చజెండా .. సర్కార్ కు షాక్