NewsOrbit
తెలంగాణ‌ న్యూస్

Breaking: కృష్ణానదిలో ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు మృతి

Advertisements
Share

Breaking: గద్వాల జిల్లా ఇటిక్యాల మండలంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మంగంపేటలోని కృష్ణానదిలో ఈతకు వెళ్లిన నలుగురు మృతి చెందారు. వేసవి తాపాన్ని తీర్చుకునేందుకు సరదాగా ఈత కొట్టేందుకు పిల్లలు, యువకులు కృష్ణానదిలోకి దిగారు. వారు దిగిన ప్రదేశంలో లోతు ఎక్కువగా ఉండటం, కాలు ఆనకపోవడంతో నీటిలో మునిగిపోయారు. ఈతకు వెళ్లిన నలుగురు చిన్నారులు మరణించారని తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

Advertisements
four died in Krishna River gadwal dist

 

గత ఈతగాళ్ల సహాయంతో మృతదేహాలను బయటకు తీశారు. మృతులు ఇటిక్యాల మండలం వల్లూరు గ్రామానికి చెందిన అఫ్రీన్ (17), సమీర్ (8), నౌషిక్ (7), రిహాన్ (15) గా పోలీసులు గుర్తించారు. నదిని చూసేందుకు ఆటోలో మొత్తం 11 మంది వెళ్లినట్లుగా సమాచారం. వారిలో నలుగురు ఈతకు దిగి మరణించారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదశ్చాయలు అలుముకున్నాయి.

Advertisements

Share
Advertisements

Related posts

Tamannah : సినిమాలకంటే వెబ్ సిరీస్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టిన తమన్నా..!

GRK

డీఎంకే నేత వివాదాస్పద వ్యాఖ్యలు .. రాజ్ భవన్ సీరియస్ ..డీఎంకే నేతపై పోలీసులకు ఫిర్యాదు

somaraju sharma

ప్రేమించిన యువతి కోసం ‘సైకో’గా మారి స్నేహితుడినే పాశవికంగా హత్య చేసిన హరికృష్ణ .. పోలీస్ విచారణలో దిగ్భాంతి గొలిపే విషయాలు వెలుగులోకి..

somaraju sharma