టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైదరాబాద్ కు చెందిన వ్యాపారి నందకుమార్ మద్యవర్తిగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఆ కేసులో రామచంద్రభారతి, సింహయాజీలతో పాటు నందకుమార్ ను మొయినాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముగ్గురు నిందితులను పోలీసులు విచారిస్తున్నారు. మరో పక్క నందకుమార్ కు జీహెచ్ఎంసీ అధికారులు షాక్ ఇచ్చారు. ఆయనకు ఫిల్మ్ నగర్ లో డెక్కన్ హోటల్ ఉంది. ప్రమోద్ అనే భాగస్వామితో కలిసి నందకుమార్ ఈ హోటల్ ను నిర్వహిస్తున్నారు. ఈ హోటల్ లోని కమర్షియల్ భవనానికి జీహెచ్ఎంసీ అధికారులు ఆదివారం కూలగొట్టారు. నందకుమార్ స్థలాన్నిలీజ్ కు తీసుకుని అక్రమ నిర్మాణాలు చేపడుతున్నందున వాటిని కూల్చివేస్తున్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు తెలుపుతున్నారు.నోటీసులు ఇచ్చినా అపకుండా నిర్మాణాలు కొనసాగిస్తుండటంతో పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేసినట్లు అధికారులు తెలిపారు.
జీహెచ్ఎంసీ అధికారులు నిర్మాణాలను కూల్చివేస్తున్న సమయంలో నందకుమార్ భార్య చిత్ర అడ్డుకున్నారు. తమ లీజ్ ల్యాండ్ లో అక్రమంగా కూల్చివేతలకు పాల్పడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే భవనాన్ని కూల్చివేశారని ఆమె ఆరోపించారు. ఇంతకు ముందు నోటీసులు ఇస్తే లీజ్ అగ్రిమెంట్ లను అధికారులకు చూపించామని తెలిపారు.. కేవలం రాజకీయ కక్షతోనే కూలుస్తున్నట్లు అనుమానంగా ఉందని ఆమె పేర్కొన్నారు. కనీసం వస్తువులు తీసుకోవడానికి కూడా అవకాశం ఇవ్వకుండా కూల్చివేశారని ఆమె ఆరోపించారు. భూమికి సంబందించి తమ వద్ద ఉన్న ఆధారాలు మొత్తం అధికారులకు అందిస్తామని ఆమె తెలిపారు. ఇటీవల దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నందకుమార్ రెండవ నిందితుడుగా ఉన్నారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఇటీవల నందకుమార్ హోటల్ లో, నివాసంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు.
Breaking: అక్రమ నిర్మాణాలు కూల్చివేత.. అబ్దుల్లాపూర్ మెట్ లో ఉద్రిక్తత
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?