Harish Rao: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మేనల్లుడు హరీశ్ రావు ఆరోగ్యమంత్రి అయిపోయినట్లేనా? ఈ విషయంలో అధికారిక ప్రకటన విడుదల కానప్పటికీ జరుగుతున్న ప్రచారం, పరిణామాలు దీనికి ఆజ్యం పోస్తున్నాయని పలువురు అంటున్నారు. తాజాగాకేంద్రంపై మంత్రి హరీష్ రావు తనదైన శైలిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, ఇవి కరోనాకు అనుబంధమైనవి కావడం, పైగా ఆ కామెంట్లు నేరుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పై చేసినవి కావడంతో మళ్లీ ఈ ప్రచారం జరుగుతోంది.
హరీశ్ రావు ఆరోగ్య మంత్రి
టీఆర్ఎస్ సీనియర్ నేత ఈటల రాజేందర్ను సీఎం కేసీఆరే కేబినెట్ నుంచి బర్తరఫ్ చేసిన తర్వాత ఆరోగ్య తన పరిధిలోనే ఉంఉకున్న సంగతి తెలిసిందే. ఆరోగ్య శాఖను చూస్తున్న సీఎం కేసీఆర్.. ఈ సందర్భంగా తీసుకునే నిర్ణయాల అమలులో హరీశ్ రావును భాగస్వామ్యం చేస్తున్నారు. దీంతో ఆయన కరోనా కట్టడికి చేపట్టాల్సిన చర్యలపై వరుసగా సమీక్షలు చేశారు. గాంధీకి సీఎం కేసీఆర్ వెళ్లినపుడు సైతం మంత్రి హరీశ్ రావు వెంట వెళ్లారు. దీంతో ప్రస్తుతం ఆర్థిక శాఖ మంత్రిగా కొనసాగుతున్న హరీశ్రావుకు త్వరలో హెల్త్ పోర్టుఫోలియో కూడా అప్పగించే అవకాశం ఉందన్న ప్రచారం సాగింది.
మళ్లీ సంచలన కామెంట్లు….
డబ్బు ఖర్చు పెట్టినా వ్యాక్సిన్లు కొనలేని పరిస్థితి దేశంలో ఉందని మంత్రి హరీశ్ రావు తాజాగా మీడియాతో మాట్లాడుతూ కామెంట్ చేశారు. కేంద్రం వ్యాక్సిన్లు ఇవ్వదు.. బయట కొనడానికి అవకాశం ఇవ్వదని ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఏ రాష్ట్రానికి ఎన్ని వ్యాక్సిన్లు ఇవ్వాలో 2 కంపెనీలకు కేంద్రమే చెబుతోందన్న ఆయన అమ్మ పెట్టదు.. అడుక్కు తిననివ్వదు అనేలా కేంద్రం తీరు ఉందని సెటైర్ వేశారు. రాష్ట్రాలు వ్యాక్సిన్ కొనే అంశాన్ని కేంద్రమే నిర్ణయించడం సరికాదని ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ వ్యాక్సిన్ కోసం వంద కోట్లు అడ్వాన్స్గా ఇస్తేనే కొవిషీల్డ్, కొవాగ్జిన్లకు విడుదల చేశారని పేర్కొన్నారు. దేశంలో సరిపడా వ్యాక్సిన్ లేదు కాబట్టే గ్లోబల్ టెండర్లు పిలుస్తున్నట్లు హరీశ్ రావు తెలిపారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?