Harish Rao: తెలంగాణలో ఆసక్తి రేకెత్తిస్తున్న హుజురాబాద్ ఉప ఎన్నిక బరిలో టీఆర్ఎస్ పార్టీ ట్రబుల్ షూటర్, మంత్రి హరీశ్ రావు ప్రత్యక్షంగా ఎంట్రీ ఇచ్చారు. అండర్ గ్రౌండ్ వర్క్కే ఇంతకాలం పరిమితం అయిన హరీశ్ రావు.. ఇప్పుడు నేరుగా రంగంలోకి దిగారు. బుధవారం హుజురాబాద్ పట్టణానికి చేరుకున్న ఆయన బైక్ ర్యాలీతో వచ్చి అంబేడ్కర్ విగ్రహానికి పూల మాల వేసి జమ్మికుంట, ఇల్లంతకుంట మండల కేంద్రాల్లో పర్యటించిన అనంతరం వీణవంకలో మహిళా సంఘాలతో నిర్వహించే సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఈటల రాజేందర్కు ఊహించని కౌంటర్ ఇచ్చారు.
Read More: KCR: హుజురాబాద్ లో అభ్యర్థితో కేసీఆర్ ఏం చెప్పదల్చుకున్నారంటే…
ఈటల ఏమన్నారంటే…
ఇటీవల ఓ సమావేశంలో ఈటల మాట్లాడుతూ దమ్ముంటే కేసీఆర్, హరీశ్ రావు తనపై పోటీ చేయాలని సవాల్ విసిరారు.
దీనికి మంత్రి హరీశ్ రావు కౌంటర్ ఇచ్చారు. ఈటల రాజేందర్ బీజేపీలో చేరాక భాష మారిందని పేర్కొన్న హరీశ్ ఓటమి భయంతో ఆయన మాటలు జారుతున్నాడని కామెంట్ చేశారు. ఎన్నికలు వచ్చినప్పుడు తనను గెలిపిస్తే ఏం చేయాలో చెప్పాల్సింది పోయి బీజేపీ నుండి పోటీ చేస్తు ఈటల తనను చూసి ఓటు వేయమంటున్నారని హరీశ్ రావు ఎద్దేవా చేశారు. మంత్రిగా ఉన్నప్పుడు పనులు చేయలేని ఈటల రాజేందర్ ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉండి ఏం చేస్తాడు? అని కామెంట్ చేశారు.
Read More: Eatela Rajendar: ఈటల రాజేందర్ విజయానికి అయోధ్య రాముడికి లింక్ ఏంటో తెలుసా?
బండి సంజయ్ గురించి సంచలన వ్యాఖ్యలు..
బీజేపీలో ఆత్మ వంచన చేసుకుంటున్న ఈటల రాజేందర్ ఆత్మగౌరవం అంటున్నాడని హరీశ్ రావు మండిపడ్డారు. ఈటల రాజేందర్ గెలిస్తే ఒక వ్యక్తి గెలుస్తాడని అదే సమయంలో ప్రజలు ఓడిపోతారని సంచలన వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ ఎంపీగా గెలిస్తే ఒక పది లక్షల పని అయినా ఇక్కడ చేశాడా? అని ప్రశ్నించారు. బండి సంజయ్ ఎంపీగా గెలిచినప్పటికీ ఎలాంటి పని చేయకపోతే ఎమ్మెల్యేగా ఈటల రాజేందర్ గెలిస్తే ఎం చేస్తాడో ఆలోచించుకోవాలని ప్రజలకు సూచించారు. ఈటల దత్తత తీసుకున్న గ్రామాల్లో కూడా ఇప్పటివరకు ఒక్క డబుల్ బెడ్ రూం కూడా నిర్మింలేదని హరీశ్ రావు మండిపడ్డారు. హుజురాబాద్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ గెలిస్తే డబుల్ బెడ్ రూం ఇళ్లతో పాటు అనేక పథకాలు లబ్ధి చేకూరుస్తాయని చెప్పారు.