Harish Rao: టీఆర్ఎస్ పార్టీ దూకుడు కొనసాగుతున్న సమయంలో దుబ్బాకలో గెలుపుతో బీజేపీ నేత రఘునందన్ రావు తన సత్తా చాటిన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా ఆయన అవాక్కయ్యేలా మంత్రి హరీశ్ రావు వ్యవహరించారని అంటున్నారు. దుబ్బాక పట్టణంలో పలు అభివృద్ధి పనులకు మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేశారు. తర్వాత బాలాజీ ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఫరూక్ హుస్సేన్ లతో కలిసి పాల్గొని మాట్లాడారు. దుబ్బాక లో బీజేపీ ఎమ్మెల్యే ఉన్నా అభివృద్ధి మాత్రం ఆపమని మంత్రి స్పష్టం చేశారు.
Read More: BJP: బీజేపీ ఆ విషయంలో కేసీఆర్ను వదిలిపెట్టట్లేదుగా!
హరీశ్ రావు ఎన్ని మాటలు చెప్పారంటే..
దుబ్బాకలో అసంపూర్తిగా ఉన్న పనులన్నీ పూర్తి చేస్తామని మంత్రి హరీశ్ రావు తెలిపారు. అంబేద్కర్ భవనం, జగ్జీవన్ రామ్ భవనంకు రూ.50 లక్షల చొప్పున మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. “వంద పడకల ఆసుపత్రి కి ప్రహరీ గోడ కట్టిస్తాం. దళిత బంధు పథకం కొత్తగా రాలేదు.. బడ్జెట్ లోనే ప్రవేశపెట్టినం. దుబ్బాక లో ఇదే ఆర్థిక సంవత్సరంలో దళిత కుటుంబాలకు కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం చేస్తాం.“ అని తెలిపారు.
Read More: KCR: ఆ కాంగ్రెస్ లీడర్ వల్లే.. ఈటలను బయటకు పంపించిన కేసీఆర్!
3 లక్షల మందికి ఆ గుడ్ న్యూస్…
ఇచ్చిన మాటకు కట్టుబడి 3 లక్షల మంది కి రేషన్ కార్డులు ఇస్తున్నామని మంత్రి హరీశ్ రావు తెలిపారు. రాష్ట్రంలో 90.5 శాతం మందికి రేషన్ బియ్యం అందుతున్నాయని స్పష్టం చేశారు. రెండువేల ఏడువందల కోట్ల తో రాష్ట్రంలో రేషన్ బియ్యం పంపిణీకి ఖర్చు పెడుతున్నామన్నారు. ప్రతి పేదవారికి రేషన్ బియ్యం ఇస్తామని హరీశ్ రావు అన్నారు. రైతులకు 24 గంటల ఉచిత కరెంటు కేవలం తెలంగాణ లోనే అమలు అవుతుందని, ప్రతి పేదింటి ఆడపిల్ల పెండ్లికి లక్ష రూపాయలు ఇస్తున్నామని గుర్తు చేశారు. సంక్షేమానికి చిరునామా తెలంగాణ ప్రభుత్వం.. దేశానికి రోల్ మోడల్ తెలంగాణ ప్రభుత్వం అని వివరించారు. వచ్చే రెండు సంవత్సరాలలో దళిత బంధు పథకం పూర్తి చేస్తాం. కొద్ది రోజుల్లో స్వంత జాగలో ఇళ్లు కట్టించే కార్యక్రమం ఉంటుంది. రైతులు ఫామాయిల్ తోటలపై దృష్టి పెట్టాలి.“ అని సూచించారు.