Big Breaking: తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. కర్ఫ్యూ లాంటి ఆంక్షలు అమలు చేస్తున్నా పెద్దగా ఫలితం కనబడటం లేదు. దీంతో కేసిఆర్ సర్కార్ కఠిన లాక్ డౌన్ అమలునకు కీలక నిర్ణయం తీసుకుంది.
రేపటి నుండి పది రోజుల పాటు లాక్ డౌన్ అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కొద్ది సేపటి క్రితం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఉదయం 6గంటల నుండి 10గంటల వరకూ నిత్యావసర వస్తువులు, కూరగాయలు ఇతర వస్తువుల కొనుగోలుకు అనుమతి ఇచ్చింది.
లాక్ డౌన్ నిర్ణయానికి సీఎం కేసిఆర్ తొలి నుండి వ్యతిరేకం అయినప్పటికీ హైకోర్టు నుండి వివిధ వర్గాల నుండి కరోనా కట్టడికి లాక్ డౌన్ ఒక్కటే పరిష్కారం అన్న మాట వినిపిస్తున్న నేపథ్యంలో మంగళవారం జరిగిన కేబినెట్ లో చర్చించి ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. అదే విధంగా కోవిడ్ టీకా కొనుగోలుకు గ్లోబల్ టెండర్లను పిలవాలని కేబినెట్ నిర్ణయించింది.