బంగారం అక్రమ రవాణా నిరోధానికి విస్తృతంగా ఎయిర్ పోర్టుల్లో తనిఖీలు నిర్వహిస్తూ కేసులు నమోదు చేస్తున్నా స్మగ్లింగ్ మాత్రం ఆగడం లేదు. తరచుగా ఎయిర్ పోర్టుల్లో భారీగా కస్టమ్స్ అధికారులు బంగారాన్ని స్వాధీనం చేసుకుంటూనే ఉన్నారు. తాజాగా గట్టుచప్పుడు కాకుండా విదేశాల నుండి అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్న మహిళలను శంషాబాద్ ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు పట్టుకుని వారి వద్ద నుండి దాదాపు ఏడు కోట్ల రూపాయల పైగా విలువైన బంగారు అభరాణాలను స్వాధీనం చేసుకున్నారు.
వివరాల్లోకి వెళితే … సూడాన్ నుండి షార్జా మీదుగా (జీ9-458) విమానం ఈ తెల్లవారుజామున శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చింది. ఈ విమానంలో దిగిన 23 మంది మహిళల లగేజీలో బంగారం ఉన్నట్లుగా అధికారులు స్కానింగ్ లో గుర్తించారు. వారి లాగేజీ బ్యాగ్ ల నుండి 14,906.3 కేజీల బంగారు ఆభరణాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 23 మంది మహిళలను అదుపులోకి తీసుకుని కస్టమ్స్ అధికారులు విచారించగా, వారిలో నలుగురు మహిళలు ఈ బంగారాన్ని తరలిస్తున్నట్లుగా గుర్తించారు. నలుగురు మహిళలను అరెస్టు చేసి కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు. వారి వద్ద నుండ స్వాధీనం చేసుకున్న బంగారం విలువ సుమారు రూ.7కోట్ల 89 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు.