తెలంగాణ మంత్రి మల్లారెడ్డి, బంధువుల ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు ముగిసాయి. రెండు రోజుల పాటు 50 బృందాలు ఏకకాలంలో సోదాలు నిర్వహించిన ఐటీ అధికారులు మల్లారెడ్డి ఆయన బంధువుల నివాసాల నుండి కీలక పత్రాలు, పెద్ద ఎత్తున నగదు స్వాధీనం చేసుకున్నారు. మంత్రి మల్లారెడ్డి నివాసంలో రూ.6 లక్షలు, మల్లారెడ్డి పెద్దకుమారుడు ఇంట్లో రూ.12 లక్షలు, మల్లారెడ్డి చిన్న కుమారుడి నివాసంలో రూ.6లక్షలు, మల్లారెడ్డి అల్లుడి నివాసంలో రూ.3 కోట్లు, ప్రవీణ్ రెడ్డి ఇంట్లో రూ.1.5 కోట్లు, త్రిశూల్ రెడ్డి ఇంట్లో రూ.2కోట్లు, రఘునందన్ రెడ్డి నివాసంలో రెండు కోట్లు, ప్రవీణ్ కుమార్ నివాసంలో రూ.2.5కోట్లు, సుధీర్ నివాసంలో కోటి రూపాయలను ఐటీ అధికారులు సీజ్ చేశారు. మల్లారెడ్డి సహా కుమారులు, అల్లుడికి సోమవారం విచారణకు హజరుకావాలంటూ ఐటీ అధికారులు నోటీసులు ఇచ్చారు.
మరో పక్క తను లేని సమయంలో తన కుమారుడితో తప్పుడు స్టేట్ మెంట్ ఇప్పించి సంతకాలు చేయించుకున్నారని మంత్రి మల్లారెడ్డి బోయినపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. హాస్పటల్ లో ఉన్న తన కుమారుడుతో బలవంతంగా సంతకం చేయించుకున్నారని, ఇంట్లో రకరకాలుగా ఇబ్బందులు పెట్టారని ఆయన ఆరోపించారు. ఐటీ అధికారుల తీరుపై మంత్రి మల్లారెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. వీళ్లు ఐటీ అధికారులు కాదు, రక్త పిశాచులు అంటూ సంభోధించారు. ఉన్నవి లేనట్లుగా, లేనివి ఉన్నట్లుగా రాస్తున్నారని ఆరోపించారు. చిత్ర హింసలకు గురి చేసి గందరగోళంగా రైడ్స్ చేసారని మండిపడ్డారు. తమ వద్ద ఎటువంటి డబ్బు దొరకలేదనీ, మెడికల్ కళాశాలకు సంబంధించి అన్ని అబద్దాలు రాశారని మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు.
కేంద్రానికి సుప్రీం కోర్టు ఊహించని షాక్ .. ఎన్నికల సంఘం కమిషనర్ల నియామకాలపై సంచలన వ్యాఖ్యలు