Huzurabad By election Results 2021: హూజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ వర్సెస్ ఈటల గానే హోరాహోరీ పోరు జరిగిన విషయం తెలిసిందే. ఉదయం నుండి జరుగుతున్న ఓట్ల లెక్కింపులో ఈటల రాజేందర్ తన హవా కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకూ 17 రౌంట్ లలో ఓట్ల లెక్కింపు పూర్తి కాగా 14వేల పైచిలుకు మెజార్టీలో ఈటల కొనసాగుతున్నారు. రెండు రౌంట్ లలో మాత్రమే టీఆర్ఎస్ అభ్యర్ధి స్వల్ప మెజార్టీ తెచ్చుకున్నారు. పేరుకు బీజేపీ అభ్యర్ధి అయినప్పటికీ ఈటల వర్సెస్ కేసిఆర్ అన్నట్లుగానే ఇక్కడ పోటీ జరిగింది అనేది అందరికీ తెలిసిందే.
ఈటలను ఎట్టిపరిస్థితుల్లోనూ అసెంబ్లీలోకి అడుగుపెట్టకుండా చూడాలన్న పట్టుదలతో అధికార టీఆర్ఎస్ సర్వశక్తులను ఒడ్డింది. దళిత బంధు పథకాన్ని ఎన్నికల ముందు తీసుకువచ్చి పైలెట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రారంభించినప్పటికీ టీఆర్ఎస్ కు ఓట్లు రాలలేదు. ఈటలకు సానుభూతి పవనాలు వీయడంతో గెలుపు దిశగా పయనిస్తున్నారు. ఇంకా అయిదు రౌంట్ల ఓట్ల లెక్కింపు జరగాల్సి ఉండగా 14వేల పైచిలుకు మెజార్టీతో ఈటల ఉన్నారు.
బీజేపీ అభ్యర్ధి ఈటల రాజేందర్ కు 79,785 ఓట్లు రాగా టీఆర్ఎస్ అభ్యర్ధి గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు 65,107 ఓట్లు వచ్చాయి. ఈటల 14,618 ఓట్ల లీడ్ లో ఉన్నారు. గెలుపు దిశగా ఈటలకు లీడ్ లు వస్తుండటంతో బీజేపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు.