Huzurabad By Election Results 2021: హోరాహోరీగా జరిగిన హూజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికల కౌటింగ్ కొనసాగుతోంది. పోస్టల్ బ్యాలెట్ లో టీఆర్ఎస్ ఆధిక్యం కనబర్చింది. అయితే ఓట్ల లెక్కింపులో ఇప్పటి వరకూ మూడు రౌండ్ లు పూర్తి కాగా మూడు రౌంట్ లలోనూ టీఆర్ఎస్ అభ్యర్ధి గెల్లు శ్రీనివాస్ యాదవ్ పై బీజేపీ అభ్యర్ధి ఈటల రాజేందర్ లీడ్ లో ఉన్నారు. తొలి రౌండ్ లో బీజేపీ అభ్యర్ధి రాజేందర్ 166 ఓట్ల ఆధిక్యం సాధించారు. బీజేపీ అభ్యర్ధికి 4610, టీఆర్ఎస్ అభ్యర్ధికి 4444, కాంగ్రెస్ అభ్యర్ధికి 114 ఓట్లు వచ్చాయి. ఇక రౌండ్ లోనూ బీజేపీ ఆధ్యక్యత కొనసాగింది. ఈ రౌండ్ లో బీజేపీ అభ్యర్ధి ఈటల రాజేందర్ 193 ఓట్లు అధిక్యం వచ్చింది. మూడవ రౌండ్ హూజూరాబాద్ మున్సిపాలిటీలోనూ బీజేపీ అభ్యర్ధి లీడ్ లో ఉన్నారు. మూడు రౌండ్ లు పూర్తి అయ్యే సమయానికి బీజేపి అభ్యర్ధి 1053 ఓట్ల ఆధిక్యతలో ఉన్నారు. కాగా పోస్టల్ బ్యాలెట్ లో టీఆర్ఎస్ కు 503, బీజేపీకి 159, కాంగ్రెస్ కు 32 ఓట్లు రాగా 14 ఓట్లు చెల్లుబాటు కాలేదు.
ఇక్కడ ఇండిపెండెంట్ అభ్యర్ధి శ్రీకాంత్ కు కారు గుర్తును పోలిన రొట్టెల పీట గుర్తు రావడం టీఆర్ఎస్ షాక్ కొట్టినట్లు కనబడుతోంది. రొట్టెల పీట గుర్తుకు తొలి రౌండ్ లో 122, రెండవ రౌండ్ లో 158 ఓట్లు వచ్చాయి. మరో గమ్మత్తైన విషయం ఏమిటంటే దళిత బంధు పథకాన్ని పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేసిన శాలపల్లిలో బీజేపీకి 135 ఓట్లు అధికంగా రావడం గమనార్హం.