Huzurabad By Poll: హూజూరాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. టీపీసీసీ అధ్యక్షుడుగా రేవంత్ రెడ్డి నియమితులైన తరవాత జరుగుతున్న మొట్టమొదటి ఎన్నిక కావడంతో హుజూరాబాద్ ఎన్నిక ఆయనకు ప్రతిష్టాత్మకంగా మారింది. ఇప్పటి వరకూ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జి గా ఉన్న కౌశిక్ రెడ్డి రాజీనామా, బహిష్కరణ నేపథ్యంలో రేవంత్ రెడ్డి బలమైన అభ్యర్థిని రంగంలోకి దింపి టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులకు గట్టి పోటీ ఇవ్వాలన్న కృత నిశ్చయంతో పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలో భాగంగా నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి, బలమైన అభ్యర్థి ఎంపికకు పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు.
Read More: BJP MP GVL: సీఎం జగన్తో పాటు బాబును జీవిఎల్ ఇరికించేశాడుగా..! దటీజ్ జీవిఎల్..!!
హుజూరాబాద్ నియోజకవర్గ పీసీసీ ఇన్ చార్జిగా దామోదర రాజనర్శింహకు బాధ్యతలను అప్పగించింది పీసీసీ. అదే విధంగా ఉప ఎన్నికల కోఆర్డినేటర్ లుగా జీవన్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ లు కొనసాగుతారని పీసీసీ ప్రకటించింది. మండలాలు, మున్సిపాలిటీల వారిగా పార్టీ బలోపేతానికి ఇన్ చార్జిలను పార్టీ నియమించింది. వీణవంకక ఆది శ్రీనివాస్, సంగీతం శ్రీనివాస్, జమ్మికుంటకు విజయ రమణారావు, రాజ్ ఠాకూర్ మక్కిన్ సింగ్, జమ్మికుంట మున్సిపాలిటీకి సిరిసిల్ల రాజయ్య, ఈర్ల కొమరయ్య, హుజూరాబాద్ కు తూముకుంట నర్సారెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, హుజూరాబాద్ మున్సిపాలిటీకి బొమ్మ శ్రీరం చక్రవర్తి, జువ్వాడి నర్సింగరావు, ఇల్లందకుంటకు నాయని రాజేందర్ రెడ్డి, కొమటిరెడ్డి నరేందర్ రెడ్డి, కమలాపూర్ కు కొండ సురేఖ, దొమ్మాటి సాంబయ్యలను ఇన్ చార్జిలుగా నియమించారు.
ఇప్పటికే బీజేపీ పక్షాన ఈటల రాజేందర్ పోటీ చేయడం కన్ఫర్మ్ కాగా టీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరు అవుతారు అనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. జీజెఎస్ అభ్యర్థి కూడా రంగంలో ఉంటారని ఇప్పటికే ఆ పార్టీ వ్యవస్థాపకుడు ప్రొఫెసర్ కోదండ రామ్ ప్రకటించారు. మరో పక్క నియోజకవర్గంలో పార్టీ నేతలు విస్తృతంగా పర్యటిస్తూ ప్రజలను ఆకట్టుకునే పనిలో ఉన్నారు. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ నేతల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలతో మాటల తూటాలు పేలుతున్నాయి.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?