Huzurabad By Poll: హుజురాబాద్ రాజకీయంలో ఊహించని ట్విస్ట్ లు చోటుచేసు కుంటున్నాయి. కేసిఆర్ మంత్రి వర్గం నుండి బర్తరఫ్ అయన ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. బీజేపీ నుండి ఈటల పోటీ చేయనున్నారని అందరూ అనుకుంటున్నారు. మరో పక్క కాంగ్రెస్ పార్టీ నుండి నియోజకవర్గ ఇన్ చార్జిగా ఉన్న కౌశిక్ రెడ్డి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసే అవకాశం ఉందని భావిస్తుండగా ఆయనను పార్టీకి రాజీనామా చేయడం, పార్టీ సస్పెండ్ చేసినట్లు ప్రకటించిన నేపథ్యంలో కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ నుండి పోటీ చేసే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజా ఈటల రాజేందర్ కూడా బీజేపీ నుండి పోటీ చేయడం అనుమానమే అన్నట్లుగా వార్తలు వినబడుతున్నాయి. అయితే ఈటల రాజేందర్ సతీమణి జమున తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు ఆ వాదనలకు బలం చేకూర్చేలా ఉన్నాయి.
Read More: Karnataka: కర్నాటకలో కథాకళి..! సీఎం యెడియూరప్పకు పదవీ గండం ఉన్నట్టా..? లేనట్టా..?
పోటీలో తాను ఉన్నా, రాజేందర్ ఉన్నా ఒకటేనని జమున వ్యాఖ్యానించారు. ఉద్యమంలోనూ ఆయన వెన్నంటే తాను ఉన్నట్లు పేర్కొన్న జమున ఎవరు పోటీ చేయాలన్నది ఇంకా నిర్ణయం తీసుకోలేదని అన్నారు. పార్టీ ఎవరికి అవకాశం ఇస్తే వారు పోటీ చేయాలన్న ఆలోచనలో ఉన్నామని తెలిపింది. ఎవరు పోటీ చేసినా గుర్తు అదే ఉంటుంది కాకపోతే మనషులే మారొచ్చని ఆమె ఆశక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈటల రాజేందర్ లాంటి ఉద్యమ నాయకుడినే బయటకు పంపిన కేసిఆర్ ప్రభుత్వం ఇంకా ఎలాంటి మోసాలకైనా పాల్పడుతుందని ప్రజలు చెబుతున్నారన్నారు. పోటీలో తాను ఉన్నా రాజేందర్ ఉన్నా ప్రజలు ఆదరించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు.
తాజాగా జమున చేసిన వ్యాఖ్యలను చూస్తేంటే టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరనేది డిసైడ్ అయిన తరువాత దాన్ని బట్టి బీజేపీ, ఈటల వ్యూహాత్మకంగా వ్యవహరించాలన్న భావనతో ఉన్నారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.