Huzurabad: హుజూరాబాద్ ఉపఎన్నిక నోటిఫికేషన్ రాకముందే పలు రాజకీయ పార్టీలు తమ ప్రచారం ముమ్మరం చేశాయి. ఈ క్రమంలోనే ప్రచారాన్ని మరింత హీటెక్కించేందుకు ముఖ్య నేతలు టూర్లు వేస్తున్నారు. అయితే, ఈ ఉప ఎన్నికకు మరింత సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. హుజురాబాద్ ఉప ఎన్నిక మరికొంత ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి కారణం తాజాగా ఈసీ రాసిన లేఖ.
Read More: KCR: కేసీఆర్ కు మద్దతిచ్చిన కేంద్ర మాజీ మంత్రి.. పార్టీ మారడమే మిగిలింది
త్వరలోనే ప్రకటన…
త్వరలోనే ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడుతుందని రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ భావించాయి. అయితే, సీఈసీ కీలక మెలిక పెట్టింది. తెలంగాణలో హుజురాబాద్తో ఉప ఎన్నికతో పాటు పొరుగు రాష్ట్రమైన ఏపీలో బద్వేల్ నియోజకవర్గానికి కూడా ఉప ఎన్నిక జరగాల్సి ఉంది. అలాగే ఉత్తరప్రదేశ్,పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను సైతం నిర్వహించాల్సి ఉంది. అయితే ప్రస్తుతం దేశంలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా వైరస్ కారణంగా ఆయా రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులతో కేంద్ర ఎలక్షన్ కమిషనర్లు సమావేశమై సమీక్ష నిర్వహించారు. తాజాగా రాజకీయ పార్టీల అభిప్రాయాలను సేకరించడం మొదలుపెట్టారు.
Read More: KCR: కేసీఆర్ మనిషిని బుక్ చేస్తున్న బీజేపీ
ఇది పరిస్థితి
కరోనా నేపథ్యంలో ఎన్నిక నిర్వహించడానికి అనువైన పరిస్థితులు ఉన్నాయా? నిర్వహిస్తే ఎలాంటి నిబంధనలను అమలు చేయాల్సి ఉంటుంది? అనే వివరాలు చెప్పాలంటూ రాజకీయ పార్టీలను సూచనలు, సలహాలు కేంద్ర ఎన్నికల సంఘం కోరింది. ఇందుకు ఈ నెల 30వ వరకు గడవు విధించింది. దీంతో హుజురాబాద్ ఉప ఎన్నిక షెడ్యూల్ ఇప్పట్లో వెలువడే అవకాశం కనిపించడం లేదన్న టాక్ తెరమీదకు వచ్చింది. మొత్తంగా హుజూరాబాద్ ఉప ఎన్నిక నిర్వహణ తాజా లేఖతో ప్రశ్నార్థకంగా మారింది.