Hyderabad Fire Accident: హైదరాబాద్ లో ఈ తెల్లవారుజామున జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో బీహార్ కు చెందిన 11 మంది కార్మికులు సజీవ దహనం అయిన సంగతి తెలిసిందే. బోయిగూడ స్క్రాప్ గోడౌన్ లో జరిగిన అగ్ని ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ అగ్నిప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి కేసిఆర్ వెంటనే స్పందించి బాధిత కటుంబాలకు రూ.5 లక్షల వంతున ఎక్స్ గ్రేషియా ప్రకటించినట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మృతదేహాలకు పోస్టు మార్టం నిర్వహించిన అనంతరం బీహార్ కు తరలించే ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ఘటనపై విచారణకు ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు. ఈ ఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దిగ్భాంతి వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా పీఎం మోడీ స్పందించారు.
హైదరాబాద్ లోని బోయిగూడలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో ప్రాణ నష్టం జరగడం బాధాకరమని అన్నారు. ఈ దుఃఖ సమయంలో మృతుల కటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానన్నారు. పీఎంఎన్ఆర్ఎఫ్ నుండి ఒక్కొక్కరికి రూ.2లక్షల వంతున ఎక్స్ గ్రేషియా మరణించిన వారి కుటుంబాలకు ఇవ్వబడుతుందని తెలిపారు.