Hyderabad Hospital Bill Viral: కరోనా చికిత్స పేరుతో హైదరాబాద్లోని పలు కార్పోరేట్ ఆసుపత్రులు దోపిడీ దందాపై గతంలో ఎన్నో వార్తలు వచ్చాయి. లక్షలు లక్షలు పేషంట్స్ బంధువుల నుండి వసూళ్లకు పాల్పడటం, ప్రైవేటు ఆసుపత్రుల అక్రమ దోపిడీపై గతంలో హైకోర్టు హెచ్చరికలు జారీ చేసిన సందర్భాలు ఉన్నాయి. పేషంట్ బంధువుల నుండి పలు కార్పోరేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు పది లక్షలు, 15 లక్షలు, 20 లక్షలకుపైగా బిల్లులు వసూలు వసూళ్లు చేశాయి. ఆసుపత్రుల్లో ఫీజులు చెల్లించుకునేందుకు మద్యతరగతి వర్గాలైతే ఆస్తులను తాకట్టు పెట్టడమో లేక ఆస్తులను తెగనమ్మి ఆసుపత్రి బిల్లు చెల్లించాల్సిన పరిస్థితులు ఉన్నాయి. తాజాగా ఓ పేషంట్ కు 28 రోజల ట్రీట్ మెంట్ కు గానూ ఆసుపత్రి యాజమాన్యం వేసిన బిల్లు ఒకటి సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తుంది. మద్య తరగతి వర్గాలు ఆ బిల్లు చూస్తే గుండె పోటు వచ్చి పైప్రాణాలు పైనే పోయే పరిస్థితి.
హైదరాబాద్ నాగోల్ లోని ఓ కార్పోరేట్ ఆసుపత్రిలో 28 రోజుల పాటు వైద్యం అందించినందుకు ఆసుపత్రి వారు వేసిన బిల్లు చూస్తే ఒక్కరూ షాక్ అవ్వాల్సిందే. స్పెషల్ రూమ్, ఏసీ రూమ్ కూడా కాదు, జనరల్ వార్డులో చికిత్స చేసినందుకే అక్షరాలా 23 లక్షల 65 వేలు రూపాయల బిల్లు పేషంట్ బంధువుల చేతిలో పెట్టారు.
వివరాల్లోకి వెళితే.. నల్లగొండ జిల్లా గరిడేపల్లి మండలం కట్టవారిగూడెం గ్రామానికి చెందిన ఎ శ్రీనివాసాచారి అనారోగ్యానికి గురైతే గత నెల 15వ తేదీన నాగోల్ లోని ఓ కార్పోరేట్ ఆసుపత్రిలో చేర్పించారు. అడ్వాన్స్ గా నాలుగున్నర లక్షలు కట్టించుకుని ఆసుపత్రిలో చేర్చుకున్నారు. ఈ నెల 13వ తేదీన పేషంట్ ను డిశ్చార్జ్ చేశారు. ఇక బిల్లు విషయాలను పరిశీలిస్తే ఎంత దారుణంగా బిల్లు వేశారో అర్థం అవుతుంది.
పేషంట్ కు ట్రీట్మెంట్ చేసింది జనరల్ వార్డు. ఈ పేషంట్ ను డాక్టర్ చూసినందుకు రోజుకు రూ.5వేలు చొప్పున అదీ ముగ్గురు డాక్టర్లకు కలిపి రోజుకు రూ.15వేలు, ఫిజియోథెరఫీ రోజుకు రూ.1500, ప్రొఫెషినల్ చార్జీ రోజుకు రూ.3వేల, ఇన్టెన్సీవిస్ట్ చార్జీ రోజుకు 5వేలు, పీపీఈ కిట్, శానిటేషన్ కు రోజుకు 5వేలు, ఆక్సిజన్ చార్జీ రోజుకు 5వేలు, సెంట్రల్ లైన్ చార్జికి రోజుకు రూ.10వేలు, రైల్స్ ట్యూబ్ చార్జి రోజుకు రూ.1500లు, ఫస్ట్ ఫ్లోర్ ఎంఐసీయు రోజుకు 35 వేలు, తరువాత జనరల్ వార్డుక రోజుకు రూ.25వేలు ఇలా విడ్డూరంగా చార్జీలు వేశారు.
కార్పోరేట్ ఆసుపత్రుల దోపిడీకి ఈ బిల్లు చక్కటి ఉదాహారణగా నిలుస్తోంది. ఒక పేషంట్ కు ట్రీట్మెంట్ చేయడానికి ముగ్గురు డాక్టర్ లు రావడం ఒక విడ్డూరం అయితే ఒక్కొక్కరికి 5వేలు చొప్పున రోజుకు 15వేలు ఫీజు కింద చార్జి చేయడం, మొత్తం మీద రూ.23,65,000లు ఫీజు గుంజడం అతి పెద్ద కార్పోరేట్ దోపిడీగా నిలుస్తుంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?