బెంగళూరు నుండి వారణాసికి బయలుదేరిన ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో పైలట్ హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. సాంకేతిక లోపాన్ని గుర్తించి పైలెట్ శంషాబాద్ లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడం పట్ల ప్రయాణీకులు ఊరట చెందారు. ముందుగా అత్యవసర ల్యాండింగ్ కావడంతో ఏమి జరిగిందో తెలియక ప్రయాణీకులు ఆందోళన చెందారు.
వివరాల్లోకి వెళితే .. బెంగళూరు నుండి వారణాసికి ఉదయం 5.10 గంటలకు బయలుదేరిన 6ఇ 897 నెంబర్ ఫ్లైట్ 7.50 గంటలకు వారనాసికి చేరుకోవాల్సి ఉంటుంది. అయితే పైలెట్ శంషాబాద్ విమానాశ్రయంలో 6.16 గంటలకు అత్యవసర ల్యాండింగ్ చేశారు. ఫ్లైట్ లో సాంకేతిక లోపం గుర్తించడం వల్ల అత్యవసర ల్యాండింగ్ చేయాల్సి వచ్చిందని ప్రయాణీకులకు విమాన సిబ్బంది తెలిపారు. ప్రయాణీకులను వేరే విమానంలోకి మార్చి వారణాసికి పంపారు. ఫ్లైట్ లో సాంకేతిక లోపం తలెత్తడం వల్లనే అత్యవసర ల్యాండింగ్ చేసి ప్రయాణీకులకు అసౌకర్యం కలగకుండా వేరే విమానంలో పంపినట్లు అధికారులు తెలిపారు.
టెన్త్ పరీక్ష ఆన్సర్ షీట్స్ మాయం .. విద్యార్ధుల్లో ఆందోళన .. ఎక్కడంటే..?