హైదరాబాద్ నార్సింగి లోని శ్రీ చైతన్య కళాశాలలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్ధి ఎన్ సాత్విక్ ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం రాత్రి కళాశాల క్లాస్ రూమ్ లో ఊరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. కళాశాలలో ఒత్తిడి వల్లనే సాత్విక్ ఆత్మహత్య చేసుకున్నాడని విద్యార్ధి బంధువులు ఆరోపిస్తున్నారు. విద్యార్ధి ఆత్మహత్య వ్యవహారంలో కళాశాల యాజమాన్యం ప్రవర్తించిన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాత్విక్ ఉరివేసుకుని అపస్మారక స్థితిలో ఉన్నాడని తెలియజేసినా కళాశాల సిబ్బంది పట్టించుకోలేదని అంటున్నారు. తోటి విద్యార్ధులే బయట వెహికల్ లిప్ట్ అడిగి సాత్విక్ ను ఆసుపత్రికి తీసుకువెళ్లారని, అయితే ఆసుపత్రికి తీసుకువెళ్లే లోపే సాత్విక్ కన్నుమూశాడని చెబుతున్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని చేసుకుని వివరాలు తెలుసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్ధి మృతదేహాన్ని పోస్టుమార్టం ఉస్మానియాకు తరలించారు. మరో పక్క కళాశాల యాజమాన్యం వల్లే సాత్విక్ ఆత్మహత్య చేసుకున్నాడని విద్యార్ధులు, మృతుడి తల్లిదండ్రులు కళాశాల వద్ద ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దీంతో కళాశాల వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఈ ఘటనతో ఆ క్యాంపస్ లో ఉండే విద్యార్థులను యాజమాన్యం రహస్యంగా ఇళ్లకు పంపిస్తొందని విద్యార్ధులు ఆరోపించారు.
కాగా ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. విద్యార్ది ఆత్మహత్య ఘటనపై విచారణకు ఆదేశించినట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఇంటర్ బోర్డు సెక్రటరీ నవీన్ మిట్టల్ ను ఆదేశించారు. సాత్విక్ ఆత్మహత్య పై అతని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కళాశాల సిబ్బంది కృష్ణారెడ్డి, ఆచార్య, వార్డెన్ నరేష్ లపై సెక్షన్ 305 కింద కేసు నమోదు చేశారు.
చంద్రబాబు చేయని ఆ పని జగన్ చేశారు .. అది ఏమిటంటే..?