IPS RS Praveen Kumar: రాజకీయ నాయకులు వేదికలపై మాట్లాడే సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ మాత్రం పొరబాటుగా మాట్లాడినా పట్టేస్తారు. దాని ప్రభావం కూడా సైలెంట్ గా కనబడుతోంది. హుజూరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ గా బాధ్యతలు నిర్వహించిన యువ నాయకుడు కౌశిక్ రెడ్డి ఇటీవల సీఎం కేసిఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ లో చేరిన సందర్భంలో హైదరాబాద్ నగరంలో భారీ ఎత్తున ఫ్లెక్సీలు, హోల్డింగ్స్ ఏర్పాటు చేయడం తీవ్ర సంచలనం అయ్యింది. దీనికి జీహెచ్ఎంసీ అధికారులు అయిదు లక్షలకు పైగా జరిమానా కూడా విధించిన సంగతి తెలిసిందే.
అయితే సభా వేదికపై కౌశిక్ రెడ్డి ప్రసంగంలో చేసిన తప్పిదాన్ని తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకుల కార్యదర్శిగా పనిచేసి స్వచ్చంద పదవీ విరమణ చేసిన ఐపీఎస్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పట్టేశారు. ఆయన ప్రసంగ వీడియోను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సోషల్ మీడియాలో షేర్ చేయగా అది వైరల్ అయ్యింది.
IPS RS Praveen Kumar: దురహంకార భావజాలం అంటూ ఘాటు వ్యాఖ్య
సభా వేదికపై కౌశిక్ నాయకులను ఆహ్వానించే సమయంలో అగ్రవర్ణాలకు చెందిన నేతలను గారు అని సంభోదించి బలహీన వర్గాల నాయకులను ఏకవచనంతో సంభోదించారు. ఈ పాయింట్ ను పట్టుకున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్విట్టర్ వేదికగా దురహంకార భావజాలం అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు.
“ కౌశిక్ బ్రదర్, మీరు ఆధిపత్య కులాల నాయకులను గారు అని గౌరవించి, పీడిత వర్గాలకు చెందిన వారిని మాత్రం ఏకవచనంతో పిలిచారు. ఇది అభ్యంతరకరం. ఇలాంటి దురహంకార భవజాలం వల్లనే జనాలు బహుజన రాజ్యం రావాలంటున్నారు. I am not against any particular caste, but we must stop this reckless framing” అని పేర్కొన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.
కౌశిక్ బ్రదర్, మీరు ఆధిపత్యకులాల నాయకులను ‘గారు’ అని గౌరవించి, పీడిత వర్గాలకు చెందిన వారిని మాత్రం ఏక వచనంతో పిలిచారు. ఇది అభ్యంతరకరం. ఇలాంటి దురహంకార భావజాలం వల్లనే జనాలు బహుజనరాజ్యం రావాలంటున్నరు. I am not against any particular caste, but we must stop this reckless framing. pic.twitter.com/jL3tOb6YIw
— Dr. RS Praveen Kumar (@RSPraveenSwaero) July 27, 2021