హైదరాబాద్ లో ఆదాయ పన్ను (ఐటీ) సోదాలు కలకలం రేపాయి. ఐటీ అధికారులు ఎప్పుడు ఎవరిపై సోదాలు జరుపుతారో తెలియక వ్యాపారాలతో ముడిపడి ఉన్న రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు హడలిపోతున్నారు. కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ లో ఐటీ సోదాలు నిర్వహించింది. రియల్ ఎస్టేట్, సినిమా ఫైనాన్సియర్స్ ఇళ్లపై దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. తాజాగా వసుధ ఫార్మా కెమ్ లిమిటెడ్ తో పాటు పలు చోట్ల ఐటీ సోదాలు జరుగుతున్నాయి.
హైదరాబాద్ వ్యాప్తంగా మొత్తం 40 చోట్ల ఐటీ అధికాలులు బృందాలుగా సోదాలు నిర్వహిస్తున్నారు. వసుధ ఫార్మా చైర్మన్ రాజు తో పాటు డైరెక్టర్ ల నివాసాల్లోనూ సోదాలు కొనసాగుతున్నాయి. వసుధ ఫార్మాతో పాటు రాజు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కూడా నిర్వహిస్తున్నారు. 15 కంపెనీల పేరుతో రాజు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు నిర్వహిస్తున్నట్లుగా ఐటీ అధికారులు గుర్తించి తనిఖీలు చేస్తున్నట్లు సమాచారం. పెద్ద ఎత్తున వ్యాపారాలను నిర్వహిస్తూ వారి ఆదాయానికి అనుగుణంగా పన్ను చెల్లించని వారిని గుర్తించి తనిఖీలు చేస్తున్నారు.
రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి అరెస్టు చేసిన సుబేదారి పోలీసులు