హైదరాబాద్ లో ఆదాయపన్ను (ఐటీ) శాఖ అధికారులు మరో సారి సోదాలు జరుపుతోంది. తెలుగు రాష్ట్రాల్లో షాపింగ్ మాల్స్ నిర్వహిస్తున్న ప్రముఖ సంస్థ ఆర్ఎస్ బ్రదర్స్ కార్యాలయాల్లో, సంస్థ ప్రతినిధుల నివాసాల్లోనూ ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. కూకట్ పల్లి, జూబ్లీహిల్స్, దిల్ సుఖ్ నగర్ సహా పది ప్రాంతాల్లో ఏకకాలంలో ఐటి అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
ఆర్ఎస్ బ్రదర్స్ ఇటీవల రియల్ ఎస్టేట్ రంగంలోకి ప్రవేశించింది. ఆనర్స్ రియల్ ఇన్ ఫ్రా పేరుతో ఆర్ఎస్ బ్రదర్స్ రియల్ ఎస్టేట్ రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తొంది. వాసవీ , సుమధుర ఎస్టేట్ సంస్థలతో ఆనర్స్ పలు ప్రాజెక్టులను చేపట్టింది. కూకట్ పల్లి లోని గల్ఫ్ ఆయిల్ భూ వివాదాల్లో కూడా ఆనర్స్ జోక్యం చేసుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆర్ ఎస్ బ్రదర్స్ సంస్థలపైనే కాకుండా ఆనర్స్ రియల్ ఇన్ ఫ్రా పెట్టుబడులు పెట్టిన వాసవీ, సుమధుర సంస్థలకు చెందిన కార్యాలయాలు, నివాసాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆర్ ఎస్ బ్రదర్స్ డైరెక్టర్ లు పొట్టి వెంకటేశ్వరలు, పొట్టి సత్యనారాయణ, టి ప్రసాదరావు, అభినయ్ వెంకట సాయి, రాకేశ్, కేశవ్ గుప్తా, సీర్న రాజమౌళి, సురేష్ నివాసాల్లోనూ ఐటి అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తొంది.
ఢిల్లీ యూనివర్శిటీ మాజీ ఫ్రొఫెసర్ డాక్టర్ సాయిబాబాకు బాంబే హైకోర్టులో బిగ్ రిలీఫ్ ..ఆయన నిర్దోషే