తెలంగాణ మంత్రి మల్లారెడ్డి నివాసాల్లో అదాయపన్ను శాఖ (ఐటీ) అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. కొంపల్లిలోని మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డి, ఆయన అల్లుడు నివాసాల్లో సోదాలు జరుగుతున్నాయి. మొత్తం 50 బృందాలు ఏకకాలంలో వారి కార్యాలయాలు, వ్యాపార సముదాయాలు, నివాసాల్లో సోదాలు నిర్వహిస్తుండటం తెలంగాణలో హాట్ టాపిక్ అయ్యింది. మల్లారెడ్డి కుటుంబానికి మేడ్చల్, మల్కాజ్ గిరి ప్రాంతాల్లో భారీగా ఆస్తులు, వ్యాపారాలు ఉన్నాయి. ఓ యూనివర్శిటీతో పాటు 39 ఇంజనీరింగ్ కళాశాలలు, రెండు మెడికల్ కళాశాలలు, ఆరు స్కూళ్లు, షాపింగ్ మాల్స్, పెట్రోల్ బంక్లు, వందలాది ఎకరాల భూములు ఉన్నట్లు సమాచారం. వివిధ వ్యాపారాల ద్వారా వచ్చే ఆదాయాన్ని సక్రమంగా చూపి పన్నులు చెల్లించడం లేదన్న అభియోగాల నేపథ్యంలో ఈ దాడులు నిర్వహిస్తున్నారని తెలుస్తొంది.
ఐటీ అధికారులతో పాటు ఇన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు కూడా ఉన్నారని వార్తలు వినబడుతున్నా అందుకు సంబంధించి అధికారుల నుండి ఇంత వరకూ అధికార సమాచారం ఏమీ రాలేదు. దూలపల్లిలోని మల్లారెడ్డి కళాశాలలో ఐటీ అధికారులు భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారని, నోట్ల లెక్కింపు మెషిన్ ద్వారా నగదును లెక్కిస్తున్నారని సమాచారం. కొద్ది రోజుల క్రితమే రియల్టర్లు, గ్రానైట్ వ్యాపారాలు నిర్వహించే వ్యాపారులు, నేతల ఇళ్లు, కార్యాలయాలపై ఈడీ, ఐటీ అధికారులు సోదాలు జరపగా తాజాగా మంత్రి మల్లారెడ్డికి చెందిన వ్యాపారాలపై ఐటీ తనిఖీలు నిర్వహించడం సంచలనం అయ్యింది. ఈడీ, ఐటీ వరుస తనిఖీల పరంపర వ్యాపారాలతో ముడిపడి ఉన్న అధికార టీఅర్ఎస్ వర్గాలను ఆందోళనకు గురి చేస్తుంది.
టీడీపీకి తెలుగు బూతుల పార్టీగా కొత్త అర్ధం చెప్పిన సీఎం వైఎస్ జగన్