NewsOrbit
తెలంగాణ‌ న్యూస్

IT Rides: రియల్ ఎస్టేట్ సంస్థలపై కొనసాగుతున్న ఐటీ దాడులు ..భారీగా నగదు, డాక్యుమెంట్లు స్వాధీనం

Share

IT Rides:  తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ సంస్థలపై వరుసగా మూడవ రోజు కూడా ఆదాయపన్ను (ఐటీ) దాడులు కొనసాగిస్తున్నది. కోహినూర్ తో పాటు మరో ఆరు రియల్ ఎస్టేట్ ఆఫీసుల్లో ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. అయిదు సంవత్సరాలుగా కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలు పన్ను చెల్లింపుల్లో అవకతవకలకు పాల్పడినట్లు అందిన సమాచారంతో ఆదాయపన్ను శాఖ అధికారులు మూడు రోజుల క్రితం తనిఖీలు చేపట్టిన సంగతి విదితమే. ఇందులో భాగంగా శనివారం ఉదయం నుండే వేర్వేలు బృందాలుగా ఐటీ అధికారులు విడిపోయి మొత్తం నలభై ప్రాంతాల్లో సోదాలు జరుపుతున్నారు.

income tax dept

 

సోదాల్లో భాగంగా భారీ మొత్తంలో నగదు, కీలక డాక్యుమెంట్లు ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లుగా సమాచారం అందుతోంది. దాంతో పాటు కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థల యాజమాన్యాలు బినామీ కంపెనీల పేర పెద్ద ఎత్తున భూ క్రయ విక్రయాలు జరిపినట్లుగా గుర్తించినట్లు తెలుస్తొంది. వీటికి సంబందించి తనిఖీలు పూర్తి అయిన తర్వాత అధికారికంగా సమాచారాన్ని అధికారులు వెల్లడించే అవకాశం ఉంది.


Share

Related posts

చైనాలో మళ్లీ స్టార్ట్..??

sekhar

Ram – Kruthi: పట్టాలెక్కనున్న రామ్ – కృతి సినిమా..!!

bharani jella

ఇన్నాళ్లూ దాక్కుని దాక్కుని డ్రామా… రెడ్ హ్యాండెడ్ గా దొరికిన బీజేపీ!

CMR