CBI Court: జగన్ ఆక్రమాస్తుల కేసులోని పెన్నా చార్జిషీట్ నుండి తన పేరు తొలగించాలని గనులశాఖ విశ్రాంత ఐఏఎస్ అధికారి రాజగోపాల్ దాఖలు చేసిన డిశ్చార్జి పిటిషన్ పై సీబీఐ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. చార్జిషీట్ నుండి రాజగోపాల్ పేరును తొలగించవద్దని కోర్టును సీబీఐ కోరింది. ఈ మేరకు కోర్టుకు సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది.
మరో విశ్రాంత ఐఏఎస్ అధికారి ఎం శ్యామ్యల్, పీఆర్ ఎనర్జీ సంస్థ డిశ్చార్జి పిటిషన్ లపై కౌంటర్లు దాఖలు చేసేందుకు సీబీఐ గడువు కోరింది. పెన్నా గ్రూపునకు చెందిన పయనీర్ హాలిడే రిసార్ట్స్ దాఖలు చేసిన డిశ్చార్జి పిటిషన్ ను సాంకేతిక కారణాల వల్ల కోర్టు వెనక్కు పంపించింది. పెన్నా చార్జిషీట్ పై విచారణను సీబీఐ కోర్టు జూలై ఆరవ తేదీకి వాయిదా వేసింది.