Janareddy: తెలంగాణలో ఇప్పుడు అందరి చూపు నాగార్జునసాగర్ ఉప ఎన్నికపై పడింది. కాంగ్రెస్ ముఖ్య నేత జానారెడ్డి ఆ పార్టీ తరఫున బరిలో దిగుతుండటం, టీఆర్ఎస్ పార్టీకి సిటింగ్ సీట్ కావడంతో అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య మాటల యుద్దం జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ అభ్యర్థి జానారెడ్డిపై సీఎం కేసీఆర్ బహిరంగసభలో కామెంట్లు చేయగా.. సీఎం వ్యాఖ్యలకు అదే స్థాయిలో జానారెడ్డి కౌంటర్ ఇచ్చారు. దీంతో ఈ ఇద్దరు నేతలు ఎవరూ తక్కువ కాదని నిరూపించుకున్నారని అంటున్నారు.
Janareddy తగ్గేదేలే….
అధికార పార్టీ తీరు తనను బాధించిందని జానారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ చావు నోట్లో తల పెట్టి తెలంగాణ సాధించానంటున్నారు.. కానీ, కాంగ్రెస్ పార్టీ రెండు రాష్ట్రాల్లో చావు నోట్లో తల పెట్టి తెలంగాణ ఇచ్చిందన్న విషయం మరచిపోవద్దు అని జానారెడ్డి అన్నారు. తెలంగాణ సాధన కోసం మేం పూర్తిగా సహకరించాం కాబట్టే తెలంగాణ వచ్చిందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని జానారెడ్డి హితవు పలికారు. నా సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఏనాడూ పదవుల కోసం పాకులాడలేదన్న ఆయన.. తెలంగాణ ఏర్పాటు కోసం మంత్రులతో రాజీనామా చేయించింది జానారెడ్డి కాదా.. జేఏసీ ఏర్పాటు అయ్యింది నా ఇంట్లో కాదా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. 30, 40 ఏళ్లు శాంతి సామరస్యాలు వెల్లివిరిసేలా నేను పనిచేశాను అని అన్నారు.
కుర్చీ వేసుకొని కూర్చొని…
సీఎం కేసీఆర్ దిగజారుడు రాజకీయాలు మానుకోవాలి అని జానారెడ్డి అన్నారు. పదవుల కోసమే కాదు.. ఎమ్మెల్యే టికెట్ కోసం కూడా నేను ఏనాడూ ఎవరి చుట్టూ తిరిగింది లేదని జానారెడ్డి అన్నారు. తాను కుర్చీ వేసుకుని కూర్చుని ప్రాజెక్టులు పూర్తి చేస్తానని అసలు హైదరాబాద్ కుర్చీ వేసుకుని కూర్చుంది కేసీఆర్ అంటూ సెటైర్లు వేశారు జానారెడ్డి. ఈ ఎన్నికలు అధికార టీఆర్ఎస్ అహంకారానికి.. సాగర్ ప్రజల ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న ఎన్నికలని పేర్కొంటూ జానారెడ్డి ఎమోషనల్ టచ్ ఇచ్చారు.