Kavitha: కల్వకుంట్ల కవిత … తెలంగాణ సీఎం కేసీఆర్ తనయ. రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న ఎమ్మెల్సీగా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన తర్వాత మునుపటి దూకుడు కొనసాగిస్తున్నారు. పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలంగా పాల్గొంటున్నారు. మళ్లీ తన పార్లమెంటు నియోజకవర్గం అయిన నిజామాబాద్పై ఫోకస్ పెట్టారు. అలా తాజాగా ఆమె పాల్గొన్న ఓ కార్యక్రమంలో సంచనల వ్యాఖ్యలు చేశారు. దీంతో కవిత ఏంటి ఇలా మాట్లాడేశారు అంటూ రాజకీయవర్గాలు చర్చించుకుంటున్నాయి.
Read More : corona: కరోనా వ్యాక్సిన్ వేసుకుంటే మీకు ఎన్ని డిస్కౌంట్లు, ఆఫర్లు వస్తాయో తెలుసా?
నియోజకవర్గంలో బిజీబిజీగా కవిత…
ఈనెల 11న ఎమ్మెల్సీ కవిత నిజామాబాద్ రూరల్ నియోజక వర్గంలో కాళేశ్వరం 21 ప్యాకేజి పనులను సందర్శించారు. అధికారులతో మాట్లాడి ప్యాకేజి వివరాలు తెలుసుకున్నారు. ఈనెల 12 నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా చేపట్టిన అన్నదాన కార్యక్రమాన్ని పరిశీలించారు. మధ్యాహ్నం నిజామాబాద్ లో కొత్తగా నిర్మిస్తున్నపార్టీ ఆఫీసును సందర్శించారు.
Read More: KCR: కరోనా విషయంలో కేసీఆర్ కన్నెర్ర చేస్తే…ఇలా ఉంటుంది
కవిత సంచలన వ్యాఖ్యలు….
తాజాగా జగిత్యాల పర్యటనలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ, కవిత ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రానున్న రోజుల్లో సమీకరణాలు మారుతాయంటూ సీఎం కేసీఆర్ కూతురు హాట్ కామెంట్లు చేశారు. ఆసక్తిర రాజకీయాలు జరుగుతాయని పేర్కొన్న కవిత ఏది జరిగినా అది టీఆర్ఎస్ పార్టీ మంచికే జరుగుతుందని జోస్యం చెప్పారు. రాష్ట్రంలో అనేక అంశాలు చర్చకు వస్తాయన్న కవిత ఇంతకు మించి ఇప్పుడు ఏమీ మాట్లాడను అంటూ ట్విస్ట్ ఇచ్చారు. దీంతో.. తెలంగాణలో పెద్ద ఎత్తున రాజకీయ సమీరణాలు మారనున్నాయా? అనే చర్చ మళ్లీ ప్రారంభం అయింది. మరికొందరు నేతలు అధికార పార్టీలో చేరుతారా? లేదా మరికొందరు నేతలకు పదవుల నుంచి ఉద్వాసన తప్పదా? అనే టాక్ మొదలైంది. ఇంతకీ కవిత వ్యాఖ్యల మర్మం ఏంటో!