KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన పార్టీ తరఫున మరో సంచలన ప్రతిపాదన చేశారు. ఊహించని రీతిలో కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పడేసేలా ఆయన కొత్త డిమాండ్ తెచ్చారు. భారత రాజ్యాంగ నిర్మాత డా. బీ.ఆర్. అంబేద్కర్ ఫొటోను కరెన్సీ నోటుపై ముద్రించాలని టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేత, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
Read More : KCR: కేసీఆర్కు షాక్.. హుజురాబాద్లో మారిపోతున్న సీన్…
కొత్త డిమాండ్ ఏంటంటే…
కరెన్సీపై అంబేద్కర్ ఫొటో సాధన సమితి జాతీయ కమిటీ ప్రతినిధులు మంత్రుల నివాసంలో వినోద్ కుమార్తో సమావేశమయ్యారు. తమ డిమాండ్కు మద్దతు ఇవ్వాలని వినోద్ కుమార్ ను కమిటీ ప్రతినిధులు కోరారు. కమిటీ చేపట్టిన ఆగస్టు 3,4,5 తేదీలలో ‘చలో ఢిల్లీ’ వాల్ పోస్టర్ను బోయినపల్లి వినోద్ కుమార్ ఈ సందర్భంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ.. కరెన్సీ నోటుపై అంబేద్కర్ ఫొటోను ముద్రించాలన్న కమిటీ ప్రతినిధుల డిమాండ్ న్యాయ సమ్మతమైనదేనని అన్నారు.
Read More : KCR: రిటైరైన వారికి మళ్లీ ఉద్యోగం.. ఇది కేసీఆర్ సర్కారులోనే సాధ్యం.
ఎంపీలకు కీలక ఆర్డర్…
కరెన్సీ నోటు పై అంబేద్కర్ బొమ్మ ఏర్పాటు చేయాలన్న అంశాన్ని పార్లమెంటు వేదికగా లేవనెత్తాలని టీఆర్ఎస్ ఎంపీలకు వినోద్ కుమార్ సూచించారు. దేశంలో రిజర్వ్ బ్యాంకు ఏర్పాటు స్ఫూర్తి ప్రదాత అంబేద్కర్ అని, అలాంటి మహానీయున్ని గౌరవించుకోవడం కనీస బాధ్యత అని వినోద్ కుమార్ వ్యాఖ్యానించారు. కాగా, హుజురాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ ఈ డిమాండ్ కు మద్దతు ఇస్తోందా అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు.