తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ telangana cm kcr రాష్ట్ర ప్రజలకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్న అంశం విషయంలో ఆయన ఎంట్రీ ఇస్తున్నారు.
దేశవ్యాప్తంగా బర్డ్ ఫ్లూ కలకలం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. హిమాచల్ ప్రదేశ్ తో పాటు ఇతర రాష్ట్రాల్లో చాలా పక్షులు చనిపోతున్నాయి. ఇందులో వలసపక్షులు కూడా ఉన్నాయి. వాటి నమూనాలను ఐసీఏఆర్-నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ ఎనిమల్ డిసీజెస్, భోపాల్ లో పరీక్షిస్తే హెచ్5ఎన్1 ఏవియన్ ఇన్ ఫ్లూయెంజా వైరస్ పాజిటివ్ గా ఉన్నట్లు నిర్ధారణ అయినట్లు కేంద్రం నిర్ధారించింది.
తెలంగాణ లో ఏం జరుగుతోంది ?
ప్రస్తుత పరిస్థితుల్లో ఈ వైరస్… పెంపుడు జంతువులు, పక్షులకు విస్తరించే అవకాశం కేంద్ర ప్రభుత్వం ఉందని తెలిపింది. వైరస్ వ్యాప్తి చెందకుండా అన్ని రాష్ట్రాలు తక్షణమే అన్ని రకాల చర్యలు తీసుకోవాలంది. పక్షులను పూర్తి స్థాయిలో పెంచడంతో పాటు నిఘా ఉంచాలని…ఏవైనా లక్షణాలు కనిపిస్తే అరికట్టేందుకు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచనలు జారీ చేసింది. అన్ని రాష్ట్రాలు తక్షణమే తగిన చర్యలు తీసుకొని వ్యాధి వ్యాప్త చెందకుండా చూడాలని కోరింది. ఈ క్రమంలో కొన్ని రాష్ట్రాల్లో పక్షులు కూడా ఈ వ్యాధి బారిన పడినట్లు సమాచారం.
తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎంట్రీ …
బర్డ్ ప్లూ వైరస్ నివారణకు తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉన్నతస్థాయి అధికారులతో మాసాబ్ ట్యాంక్ లోని కార్యాలయంలో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన తలసాని రాష్ట్రంలో బర్డ్ ప్లూ ఆనవాళ్లు లేవని.. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రభుత్వం పశుసంవర్ధక శాఖ తీసుకున్న ముందస్థు జాగ్రత్తలతో రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ వ్యాప్తికి అవకాశం లేదన్నారు. బర్డ్ ఫ్లూపై రాష్ట్రంలో 1300 అధికారుల టీమ్ లు నిరంతరం వైద్య పరీక్షలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయన్నారు. కోళ్ళ పరిశ్రమలో దేశంలో తెలంగాణ రాష్ట్రం ౩వ స్థానంలో ఉందని.. బర్డ్ ఫ్లూపై అన్ని స్థాయిల అధికారులను అప్రమత్తం చేశామన్నారు.