KCR తెలంగాణ ముఖ్యమంత్రి , టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ను సొంత పార్టీ నేతలే ఇరుకున పడేస్తున్నారా? ఒకరి తర్వాత ఒకరు అన్నట్లుగా నేతలు ఎందుకు వివాదాల్లో ఇరుక్కుంటున్నారు? అధికార పార్టీ అంటే ఆయా వర్గాల్లో ఎందుకు వ్యతిరేకత పెరిగేలా చేస్తున్నారు? ఇది ప్రస్తుతం జరుగుతున్న చర్చ. ఇప్పటికే ఓ తహశీల్దార్ బదిలీ, ఓ అడ్వకేట్ హత్య విషయంలో టీఆర్ఎస్ టార్గెట్ అవగా తాజాగా ఉద్యోగుల విషయంలో ఇంకో నేత ఇదే ట్రెండ్ కొనసాగించారు.
ఆ ఎమ్మెల్యే గారి కొత్త రచ్చ
కోదాడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అధికారుల పోస్టింగులకు సంబంధించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గ పరిధిలోని ఎమ్మార్వో, ఎస్సై, ఎంపీడీవో అధికారులు ఎవరైనా.. తాను ఉత్తరం ఇస్తేనే పోస్టింగ్లోకి వస్తారని బొల్లం మల్లయ్య అన్నారు. వద్దు అనుకుంటే అదే ఉత్తరంతో వారిని తప్పిస్తామంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. విశిష్ట అధికారాలతో వీరందిరితో పని చేయించుకోవచ్చని అధికారం మన చేతుల్లో ఉందని బొల్లం మల్లయ్య మాట్లాడిన వీడియో వైరల్ అవుతోంది.
ఇప్పటికే ఉన్న పంచాయతీ సరిపోదా?
ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ కామెంట్లపై వ్యాఖ్యలపై రెవెన్యూ, ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలతో ఏం సందేశం పంపుతున్నారని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే ఓ న్యాయవాది హత్య విషయంలో టీఆర్ఎస్ నాయకుడు ఒకరు తీవ్రంగా టార్గెట్ అవుతున్నారు. మరోవైపు ఓ తహశీల్దార్ ఆకస్మిక బదిలీ విషయంలో హైదరాబాద్ ముఖ్య నేత ఒకరు ఇరుకున పడ్డారు. ఇలాంటి సమయంలో మరో నేత సైతం అదే బాటలో సాగారని పలువురు కామెంట్లు చేస్తున్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?