NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

KCR: కేసీఆర్‌కు హుజురాబాద్ భ‌యం ప‌ట్టుకుంది.. . దానికి ఉదాహ‌రణ ఇదే!

KCR: తెలంగాణ‌లో ఇప్పుడు హుజురాబాద్ ఉప ఎన్నిక , ఈ ఉప ఎన్నిక‌ విష‌యంలో ముఖ్య‌మంత్రి కేసీఆర్ తీసుకోబోయే నిర్ణ‌యం హాట్ టాపిక్ గా మారిన సంగ‌తి తెలిసిందే. తాజాగా ఆయ‌న ప్ర‌క‌టించిన సంచ‌ల‌న ప‌థ‌కం అన్ని వ‌ర్గాల‌ల్లో చ‌ర్చ‌కు దారితీసింది. ప్ర‌తిష్టాత్మ‌క ద‌ళిత బందు ప‌థ‌కం హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ప్రారంభించేందుకు సీఎం కేసీఆర్ డిసైడ‌య్యారు. అయితే, దీనిపై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. తాజాగా ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. సీఎం కేసీఆర్ కు హుజురాబాద్ భయం పట్టుకుందని వ్యాఖ్యానించారు.

Read More: KCR: ఈట‌ల ఇలాకా నుంచి ఆ స్కీం ఆవిష్క‌రించి కొత్త గేమ్ మొద‌లుపెడుతున్న కేసీఆర్‌!

మాట మార్చిన కేసీఆర్‌…
ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ తన కార్యాలయంలో మాట్లాడుతూ.. ఏడేళ్లలో దళితులకు చేసిన మోసాల వ‌ల్లే కేసీఆర్ లో ఓటమి భయం పెరుగ‌తోంద‌న్నారు. భ్రమలు పెట్టడం కేసీఆర్ కు వెన్నతోపెట్టిన విద్యని.. 12 ఏళ్ళు దళితుడే ముఖ్యమంత్రి అని భ్రమల్లో పెట్టిన కేసీఆర్, అప్పటి పరిస్థితులు ఇప్పటి పరిస్థితులు వేరని ఒక చిన్న సాకుతో తప్పుకున్నాడన్నారు. మూడెకరాల భూ పంపిణి ప్రారంభించిన మొదటి సంవత్సరమే ఆపేసిండని..దళిత బంధును కూడా అట్లనే ఆపేయగలడన్నారు. హుజురాబాద్ లో ఎలాగైనా గెలవాలనే కేసీఆర్ దళితబంధు ప్రకటన చేశారన్నారు. ప్రభుత్వ సర్వే ప్రకారం 21వేల కుటుంబాలున్నాయని..80 వేల మంది ప్రజలున్నారని తెలిపారు. దళిత ఓట్లు కీలకం కాబోతున్నాయని వారిని అక్కున చేర్చుకుంటున్నట్లుగా కేసీఆర్ పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. ఈ క్రమంలోనే కేసీఆర్ కు హుజురాబాద్ జ్వరం రోజురోజుకు పెరుగుతుందన్నారు.

Read More : KCR: మోడీపై ఎందుకు ఈ మౌనం కేసీఆర్ సాబ్‌?

కేసీఆర్ స‌ర్వేల్లో ఏం తేలిందంటే..
ప్రతి దళిత కుటుంబానికి 10లక్షలు అంటూ పథకాన్ని తీసుకొచ్చి దళితుల మనోభావాలు ఎలా ఉన్నాయనే దానిపైనే సీఎం కేసీఆర్‌ సర్వేలు చేయిస్తున్నారన్నారు. 70 శాతం దళిత యువత వ్యతిరేకంగా ఉన్నారని.. ఏడేళ్లుగా కేసీఆర్ చేస్తున్న మోసాలపై గుర్రుగా ఉన్నారని తెలిపారు. కేసీఆర్ అహంకారానికి వ్యతిరేకంగా ఓటు వేయబోతున్నారనే అంశం వారు నిర్వహించుకున్న సర్వేల్లో వస్తుందని చెప్పారు. ఈ ఎన్నిక ఫలితమే 2023 రిపీట్ అవుతుందనే భయం కేసీఆర్ కుందన్నారు. అందుకే రైతుబంధు నాటకంలాగే.. దళితబంధును ఎత్తుకున్నారన్నారు. రాజకీయ లబ్ది, ఓట్లకోసమే ఈ పథకాన్ని తీసుకొస్తున్నారనేది స్పష్టంగా తెలుస్తుందని.. హుజురాబాద్ లో ఫైలెట్ ప్రాజెక్టుగా చేపట్టే దళిత బంధుకు నిధులు ఎక్కడివో చెప్పాలన్నారు. హుజురాబాద్ లో మొదలుపెట్టి హుజురాబాద్ లో ముగించే పథకమో స్పష్టం చేయాలన్నారు. బడ్జెట్ కేటాయింపులు ఎక్కడి నుంచి తీస్తున్నారో చెప్పాలని..సబ్ ప్లాన్ లో ఇచ్చిన నిధులు వాడుతున్నారా? అని ప్రశ్నించారు.

author avatar
sridhar

Related posts

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!