KCR : ప్రత్యేక రాష్ట్ర సాధనే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని స్థాపించిన కెసిఆర్ తొలుత ఒకటి రెండు సార్లు ఎదురుదెబ్బలు తగిలినా మొండిపట్టుదలతో ముందుకు సాగి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు. తొలి సారి ముఖ్య మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత తన రాజకీయ చతురణతో ప్రతిపక్ష పార్టీలను కోలుకోలేని విధంగా దెబ్బ తీశారు. తనదైన శైలిలో పరిపాలన అందించి రెండవ సారి అధికారంలోకి వచ్చారు. ఇక రాష్ట్రంలో టీఆర్ఎస్ కు, కేసీఆర్ కు ఎదురు లేదు అనుకుంటున్న తరుణంలో రాష్ట్రంలో బీజేపీ తన వ్యూహాలకు పదును పెట్టింది. అధికార టీఆర్ఎస్ కు ప్రత్యామ్యాయ శక్తిగా ఎదగాలని రాబోయే ఎన్నికల నాటికి అధికార లక్ష్యంగా ముందుకు సాగాలన్న తలంపుతో ఆ పార్టీ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ కు పార్టీ పగ్గాలు అప్పగించింది.
KCR : అవినీతి వెలికితీతే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలు
బండి సంజయ్ అధికార పార్టీపై దూకుడు గా వ్యవహరిస్తూ పార్టీ బలోపేతం చేస్తుండటంతో సీఎం కెసిఆర్ ఊహించని విధంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికార పార్టీయే లక్ష్యంగా మంత్రులు, ఎమ్మెల్యేలు అవినీతి పాల్పడుతున్నారంటూ బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో ఇటీవల విమర్శలు చేస్తున్నారు. మరో పక్క సీఎం కేసిఆర్ పైనా బండి సంజయ్ తీవ్ర స్థాయిలో విమర్శల దాడి చేస్తూనే ఉన్నారు. సీఎం కేసిఆర్ కోట్లాది రూపాయల అవినీతి పాల్పడటం వల్లనే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నదని బీజెపీ నేతలు పదేపదే విమర్శలు గుప్పిస్తున్నారు.
KCR : బీజెపీ నేతల కీలక నిర్ణయం?
తాజాగా బండి సంజయ్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారని వార్తలు వస్తున్నాయి. సీఎం కేసిఆర్ అవినీతిపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసి సీబీఐ విచారణను కోరనున్నారని ప్రచారం జరుగుతోంది,. అదే విధంగా బీజెపీ ఎంపి ధర్మపురి అరవింద్ కూడా పిటిషన్ దాఖలు చేయడానికి సిద్ధం అవుతున్నారని అంటున్నారు. ఒక వేళ ఆయన దాఖలు చేయకపోతే సామాజిక కార్యకర్తలతో పిటిషన్ దాఖలుచేయించే అవకాశం ఉందని భావిస్తున్నారు. కేసిఆర్ అవినీతికి సంబంధించి సాక్షాదారాలను సైతం సేకరించి కోర్టు ముందు ఉంచాలని అనుకుంటున్నారుట. బీజేపీ ఈ విషయంలో కీలక అడుగులు వేస్తే టీఆర్ఎస్ పార్టీకి ఇబ్బందులు ఎదురవుతాయనే టాక్ వినిపిస్తోంది.