KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. దీని ఫలితంగా రాష్ట్రంలో జూనియర్ డాక్టర్ల(జూడాలు) చేపట్టిన సమ్మెకు శుభం కార్డు పడింది. రెండు రోజులుగా జూడాలు సమ్మె బాట పట్టారు. గురువారం నుంచి అత్యవసర సేవలు కూడా నిలిపివేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. దీంతో ప్రభుత్వం దిగివచ్చి గతంలో ఇచ్చిన హామీ మేరకు 15 శాతం వేతన పెంపు చేయనున్నట్లు ఆమోదం తెలిపింది. పెరిగిన స్టైఫండ్ ఈ ఏడాది జనవరి 1 నుంచి వర్తిస్తుంది.
Read More:
జూడాల లెక్క ఇది…
దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్నతమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జూనియర్ డాక్టర్లు సమ్మె బాట పట్టారు. ఈ నెల 10వ తేదీన జూడాలు సమ్మె నోటీసు ఇచ్చారు. పక్షం రోజుల్లో తమ డిమాండ్లు పరిష్కరించాలని నోటీసులో పేర్కొన్నారు.. ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో తప్పని పరిస్థితుల్లో సమ్మెకు దిగుతున్నట్లు జూడాలు తెలిపారు. అత్యవసర సేవలు మినహా మిగతా విధుల బహిష్కరణ కొనసాగిస్తోమని తెలంగాణ జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ వెల్లడించారు. ప్రభుత్వం నుంచి సరైన రీతిలో స్పందన లేదని జూడాలు పేర్కొన్నారు.
Read More : Lock down: గుడ్ న్యూస్ః పక్క రాష్ట్రంలో లాక్ డౌన్ ఎత్తేస్తున్నారు
ప్రభుత్వం కీలక నిర్ణయం…
సీనియర్ రెసిడెంట్ల వేతనాన్ని ప్రభుత్వం రూ.70 వేల నుంచి రూ.80,500కి పెంచింది. దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రభుత్వ నిర్ణయంతో జూడాల సమ్మెకు ఫుల్ స్టాప్ పడింది. డాక్టర్లు, హెల్త్ వర్కర్ల కుటుంబ సభ్యులు కరోనా బారిన పడితే.. వారికి నిమ్స్ ఆస్పత్రిలో ప్రత్యేక చికిత్స అందించాలన్న డిమాండుపై కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఇందుకోసం నిమ్స్ ఆస్పత్రిలో ప్రత్యేక డెస్కును ఏర్పాటు చేయాలని వైద్య శాఖ నిర్ణయం తీసుకుంది. జూడాలు,సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు ప్రభుత్వం ముందు పెట్టిన ఇతర డిమాండ్లపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుందనేది ఇంకా స్పష్టత రాలేదు. జూడాలతో చర్చలు జరిపిన తర్వాత 15 శాతం స్టైఫండ్ పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?