KCR: తెలంగాణలో హాట్ టాపిక్ గా మారిన హుజురాబాద్ ఉప ఎన్నిక విషయంలో సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. దళిత బంధు పథకం కింద రూ.10 లక్షల చొప్పున మంజూరు చేస్తున్నట్లు సీఎం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పథకాన్ని హుజురాబాద్ నుంచే ప్రారంభించనున్నట్లు తెలిపారు. అయితే, ఊహించని రీతిలో వాసాలమర్రిలో దళిత కుటుంబాలపై సీఎం కేసీఆర్ వరాలు కురిపించారు.
Read More : KCR: కేసీఆర్ ఆశలన్నీ అడియాసలు చేసేసిన కేంద్రం
కేసీఆర్ దత్తత గ్రామంలో…
యాదాద్రి భువనగిరి జిల్లాలోని తన దత్తత గ్రామమైన వాసాలమర్రిలో సీఎం కేసీఆర్ పర్యటించారు. ముందుగా దళిత వాడలో తిరిగి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన గ్రామ సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా వాసాలమర్రిలోని అన్ని దళిత కుటుంబాలకు దళిత బంధు ఇస్తామని చెప్పారు. గ్రామంలోని మొత్తం 76 దళిత కుటుంబాలకు దళిత బంధు పథకం కింద రూ.10 లక్షల చొప్పున మంజూరు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. రేపే బ్యాంకు అకౌంట్లలో పది లక్షలు జమ అవుతాయన్నారు. దళిత బంధు ముందుగా వాసాల మర్రి ప్రజలకే వస్తున్నందున మీ పై పెద్ద బాధ్యత ఉందన్నారు. పథకం ముందు ముందు మరింత బాగా చేసేందుకు వాసాల మర్రి ప్రజలను ఆదర్శంగా తీసుకునేలా ఉండాలన్నారు.
Read More: KCR: హుజురాబాద్ ఉప ఎన్నిక.. కేసీఆర్ కు ఓ గుడ్ న్యూస్… ఇంకో బ్యాడ్ న్యూస్…
షరతులు వర్తిస్తాయి…
దళిత బంధు పథకం కింద కేటాయిస్తున్న డబ్బు ను సరైన దిశలో ఉపయోగించాలని సీఎం కోరారు. వాసాల మర్రిలో దళితులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఒక్క రూపాయి కూడా వృథా చేయకుండా డబ్బుకు డబ్బును సంపాదించాలని కోరారు. ప్రభుత్వం ఇచ్చే సాయంతో మంచి వ్యాపారం చేసి ఆర్థికంగా దళితులు బాగు పడాలని సూచించారు. దళిత బంధు ఇచ్చినందుకు ఇతర పథకాలు దళితులకు బంద్ కావన్నారు. వాసాల మర్రి ఊరందరికీ ఇళ్లు కట్టిస్తామన్నారు. ఇళ్లు, ఇతర పథకాలు అలాగే కొనసాగిస్తామన్నారు. ఊళ్లో అందరికీ కొత్త ఇళ్లు ఇస్తామన్నారు. ఈ పది లక్షలకు ఇతర ప్రభుత్వ పథకాలకు లింక్ లేదన్నారు. అన్ని పథకాలతో పాటు అదనంగా ఇచ్చే ఈ సాయాన్ని మంచిగా వినియోగించుకోవాలన్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?