KCR:తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇలాకా అయిన ఉమ్మడి మెదక్ జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో గెలుపుతో బీజేపీ నేత రఘునందన్ రావు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ గెలుపుతో రఘునందన్ రావు అందరి దృష్టిని ఆకర్షించారు. అయితే, తాజాగా టీఆర్ఎస్ పెద్దలకు మరో షాక్ ఇచ్చాడు. దుబ్బాక మున్సిపాల్టీకి చెందిన ముగ్గురు టీఆర్ఎస్ కౌన్సిలర్లు ఎమ్మెల్యే రఘునందన్ రావు సమక్షంలో బీజేపీలో చేరారు. దీంతో షాక్ తినడం టీఆర్ఎస్ వంతు అయింది.
Read More: KCR: కేసీఆర్పై షర్మిల రాజకీయం మామూలుగా లేదుగా….
ఆ ముగ్గురు జంప్…
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో టీఆర్ఎస్ పార్టీకి చెందిన దుబ్బాక మున్సిపాలిటీ కౌన్సిలర్లు మట్ట మల్లారెడ్డి, డివిటి కనుకయ్య, దుబ్బాక బాలకృష్ణ గౌడ్ కాషాయ పార్టీలో చేరారు. వీరికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావుతో పాటుగా పార్టీ సీనియర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రఘునందన్ రావుతో పాటుగా బీజేపీ నేతలు పలు ఆసక్తికర కామెంట్లు చేశారు.
Read More: KCR: పాత గుడ్ న్యూసే… మళ్లీ చెప్పిన కేసీఆర్
బండి సంజయ్ ఏమంటున్నారంటే…
అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన కార్పొరేటర్లు బీజేపీలో చేరిన సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ
దుబ్బాకనే కాకుండా తెలంగాణ సమాజం అంతా బీజేపీ వైపు చూస్తోందని పేర్కొన్నారు. దుబ్బాకలో గెలుపుతో బీజేపీ జైత్రయాత్ర మొదలయిందని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నియంతృత్వ విధానాలతో టీఆర్ఎస్ పార్టీ నేతలే ఆ పార్టీ కి గుడ్ బై చెప్పేస్తున్నారని సంజయ్ వ్యాఖ్యానించారు.హుజురాబాద్ లో బ్రహ్మండమైన మెజార్టీతో బీజేపీ గెలవనుందని, టీఆర్ఎస్ పార్టీకి నిరాశ ఎదురవక తప్పదని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు.