KCR Govt: తెలంగాణలో ధాన్యం కొనుగోలు అంశంపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అధికార టీఆర్ఎస్ లక్ష్యంగా విమర్శలు చేస్తుండగా, టీఆర్ఎస్ పార్టీ, ప్రభుత్వం కేంద్రంలోని బీజేపీని విమర్శిస్తోంది. అటు నేతల విమర్శలు, ప్రతి విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు జరుగుతున్న వేళ తెలంగాణ సర్కార్ రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాది యాసంగి సీజ్ సంబంధించి రాష్ట్రంలో మంగళవారం నుండి రైతు బంధు పథకం కింద పెట్టుబడి సాయం నిధులు పంపిణీ చేయనుంది. ఈ విషయాన్ని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వెల్లడించారు.
Read More: AP Cinema: ఏపీలో కీలక పరిణామం.. మంత్రి పేర్ని నానితో రేపు డిస్ట్రిబ్యూటర్ల భేటీ
KCR Govt: రైతు బంధు ఈ సీజన్తో కలిపి రూ.50వేల కోట్లు
ఈ పథకం ప్రారంభం అయిన నాటి నుండి ఏడు విడతల్లో రూ.43,036,63 కోట్లు రైతుల ఖాతాలో జమ చేసినట్లు మంత్రి తెలిపారు. ఈ సీజన్ తో కలుపుకుంటే మొత్తం 50వేల కోట్ల రూపాయలు రైతు బంధు పథకం కింద రైతుల ఖాతాల్లో జమ పూర్తి అవుతుందని పేర్కొన్నారు. ఈ మేరకు మంత్రి నిరంజన్ రెడ్డి పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఈ యాసంగి సీజన్ లో 66.61 మంది రైతులకు గాను 152.91లక్షల ఎకరాలకు రూ.7645.66 కోట్లు జమ చేయనున్నట్లు తెలిపారు. దీంట్లో 3.05 లక్షల ఎకరాలకు గాను 94వేల మంది రైతులు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాదారులు, ఎకరా నుండి రెండు, మూడు, నాలుగు ఎకరాల లెక్కన గతంలో మాదిరిగా అరోహణ క్రమంలో నిధులు జమ చేస్తామని ప్రకటనలో వివరించారు.