KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సర్కారు భారీ తీపి కబురు తెలిపేందుకు సర్వం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. రాష్ట్రంలో 50 వేల ఉద్యోగాల భర్తీకి ఇప్పటికే క్లియరెన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. దీనికి కొనసాగింపుగా రాష్ట్రపతి సవరణ ఉత్తర్వుల ప్రకారం జోనల్ జీవోను ప్రభుత్వం జారీ చేసింది. దీంతో 50000 ఉద్యోగాలకు ప్రభుత్వం నుంచి నోటిఫికేషన్ రావడమే మిగిలింది. ఇదే సమయంలో పోలీసు ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న తెలంగాణ నిరుద్యోగుల కల త్వరలోనే సాకారం కానుంది. దీనికి హుజురాబాద్ ఉప ఎన్నికకు కొందరు లింక్ పెడుతున్నారు.
Read More: KCR: కేసీఆర్కు ఇంత కులపిచ్చి ఉందా?
తెలంగాణ సర్కారు నోటిఫికేషన్
తెలంగాణ పోలీస్ శాఖ లో ఉన్న ఎస్సై, కానిస్టేబుల్ ఖాళీలను భర్తీ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే నోటిఫికేషన్ ఇచ్చేందుకు సర్వం సిద్ధం చేస్తోంది. 19,000 పైగా కానిస్టేబుల్ పోస్టులు, 625 ఎస్సై పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు మొదలు పెట్టింది. పోలీస్ శాఖలో ఈ మేరకున్న ఖాళీలను గుర్తించి డీజీపీ ఆర్థిక శాఖకు నివేదిక పంపించారు. ఆర్థిక శాఖ ఆమోదం రాగానే ఈ మేరకు పోలీసు నియామకాలకు నోటిఫికేషన్ విడుదల కానుంది.
Read More: Revanth Reddy: షర్మిల పార్టీని బలహీనం చేసే పనిలో రేవంత్?!
పోలీస్ డిపార్ట్మెంట్లో జోన్ల లెక్కలివి..
పోలీస్ డిపార్ట్మెంట్ పరిధిలో మల్టీజోన్ –1లో తొలి కాళేశ్వరం జోన్లో జయశంకర్ భూపాలపల్లి, కొమురం భీం ఆసిఫాబాద్, రామగుండం పోలీస్ కమిషనరేట్, ములుగు జిల్లాలు, రెండో జోన్బాసరలో ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్, జగిత్యాల జిల్లాలు, మూడో జోన్ రాజన్నలో కరీంనగర్ పోలీస్ కమిషనరేట్, సిద్దిపేట పోలీస్ కమిషనరేట్, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్ జిల్లాలు, నాల్గో జోన్ భద్రాద్రిలో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం పోలీస్ కమిషనరేట్, మహబూబాబాద్, వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఉంది.
మల్టీజోన్–2లో ఐదో జోన్ యాదాద్రిలో సూర్యాపేట, నల్గొండ, రాచకొండ పోలీస్ కమిషనరేట్, ఆరో జోన్చార్మినార్లో హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలు, ఏడో జోన్ జోగుళాంబలో మహబూబ్నగర్, నారాయణపేట, వనపర్తి, జోగుళాంబ గద్వాల, నాగర్ కర్నూల్ జిల్లాలున్నాయి. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం జోన్ల సవరణపై సీఎస్ సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.