Kcr : కుటుంబ సమేతంగా వారణాసికి వెళ్తున్న కేసిఆర్, కారణం అదేనా..??
Kcr :తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సభ్యులతో కలిసి ప్రముఖ పుణ్య క్షేత్రం వారణాసి పర్యటన తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది. ఉత్తర ప్రదేశ్ వారణాశిలో కుటుంబంతో కలిసి కెసిఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఈ క్రమంలో సీఎం సతీమణి శోభ అదేవిధంగా కూతురు ఎమ్మెల్సీ కవిత మరియు ఇతర కుటుంబ సభ్యులు వారణాసికి చేరుకోవడం జరిగింది. రెండు రోజులపాటు కేసీఆర్ కుటుంబం వారణాసి పర్యటన చేపట్టనున్నట్లు సమాచారం. ముందుగా అస్సి ఘాట్ నుంచి దశాశ్వమేధ ఘాట్ వరకు బొట్లో ప్రయాణం చేయనున్నారు. దశాశ్వమేధ ఘాట్ లో గంగా హారతి గంగా పూజలు నిర్వహించబోతున్నారట. ఆ తర్వాత సంకట్ మోచన్ ఆలయాన్ని దర్శించుకుని అక్కడ ప్రత్యేకమైన పూజలు నిర్వహించి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నట్లు ఎమ్మెల్సీ కవిత సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.
Kcr :ముఖ్యమంత్రి స్థానంలో కేటీఆర్..??
వారణాసి ని కుటుంబంతో కలిసి సందర్శించడం ఎంతో ఆనందంగా ఉందని కవిత తెలిపారు. ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి స్థానంలో త్వరలో కేటీఆర్ పదవి బాధ్యతలు చేపట్టనున్నట్లు వార్తలు వస్తున్న క్రమంలో ఇటీవల కొత్త సచివాలయం దర్శించటం ఆ తర్వాత తాజాగా కేసిఆర్ వారణాసి కుటుంబ సమేతంగా పర్యటించడం కేసీఆర్ కి ఉన్న దైవభక్తి బట్టి చూస్తే త్వరలో తెలంగాణ రాజకీయాల్లో సీఎం మార్పు గ్యారెంటీ అనే టాక్ బలంగా వినబడుతుంది. ఇదిలా ఉంటే మరో పక్క పాలన విషయంలో మంత్రి కేటీఆర్ కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగటం ఇదే తరుణంలో పార్టీలో నాయకులు కూడా కేటీఆర్ ముఖ్యమంత్రి అనే భజన చేయడం బట్టి చూస్తే వచ్చే ఉగాది లోపు తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉన్నట్లు వార్తలు బలంగా వినబడుతున్నాయి.