KCR: తెలంగాణలో రాజకీయంగా ఆసక్తిని రేకెత్తిస్తున్న హుజురాబాద్ ఉప ఎన్నిక విషయంలో ఉత్కంఠకు తెరదించుతూ టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ యువనేత గెల్లు శ్రీనివాస్ యాదవ్కు చాన్సిచ్చిన సంగతి తెలిసిందే. మాజీ మంత్రి ఈటల రాజేందర్కు పోటీ గెల్లును దింపిన టీఆర్ఎస్ పార్టీ ఈ మేరకు ఎన్నికల్లో ఆసక్తికర ప్రచారం చేస్తోంది. గెల్లు శ్రీనివాస్ కు 2గుంటల స్థలం ఉంటే… ఈటలకు 200 ఎకరాల స్థలం ఉందని సెంటిమెంటు రంగరిస్తోంది. అయితే, ఇదే సమయంలో బీజేపీ నేతలు మరో రకంగా టీఆర్ఎస్ అభ్యర్థిని టార్గెట్ చేస్తున్నారు.
Read More: KCR: హుజురాబాద్ లో అభ్యర్థితో కేసీఆర్ ఏం చెప్పదల్చుకున్నారంటే…
ఓడిపోయే సీటులో గెల్లు శ్రీనివాస్…
ఉద్యమకారుడికి ఓడిపోయే సీటిచ్చారని సీఎం కేసీఆర్పై బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ విమర్శించారు. ఉద్యమకారుల మీద రాళ్లేసిన వ్యక్తిని ఎమ్మెల్సీ చేశారని ఆరోపించారు. పీహెచ్డీ చదువుతున్న మేధావి, ఉద్యమ బాటలో వంద కేసులు మోసిన గెల్లు శ్రీనివాస్ ఓడిపోయే చోట పోటీకి దించడం కేసీఆర్ రాజకీయం అని విమర్శించారు. మానుకోటలో తెలంగాణ ఉద్యమకారులపై రాళ్లేసిన కౌశిక్ రెడ్డికి… కేసీఆర్ ఆరేండ్ల గ్యారంటీ ఎమ్మెల్సీ ఇచ్చాడని ఎద్దేవా చేశారు.
Read More: KCR: కేసీఆర్ విషయంలో ఈ కాంగ్రెస్ సీనియర్ లెక్కేంటో అర్థం కావట్లేదట
200 ఎకరాలు వర్సెస్ 2000 ఎకరాలు…
హుజురాబాద్ లో పోటీ గెల్లు శ్రీనివాస్ తో కాదు, 2000 ఎకరాలు అక్రమంగా సంపాదించిన కేసీఆర్ తోనే పోటీ అని బీజేపీ నేత వివేక్ వెంకటస్వామి పునరుద్ఘాటించారు. హుజూరాబాద్ లో పోటీ 2000 ఎకరాలు వర్సెస్ 200 ఎకరాల మధ్య పోటీ అన్నారు. ఉద్యమకారులంటే కేసీఆర్ కు చాలా కోపమని, అందుకే ఓడిపోయే సీటు ఉద్యమకారుడైన గెల్లు శ్రీనివాస్ కు ఇచ్చారని వివేక్ పేర్కొన్నారు. మానుకోటలో ఉద్యమకారులపై రాళ్లు వేసిన కౌశిక్ రెడ్డికి ఇచ్చిన ఎమ్మెల్సీ పదవి గెల్లు శ్రీనివాస్ కు ఎందుకు ఇవ్వలేదని ఆయన నిలదీశారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?